Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాది చెన్నై.. నేను దక్షిణాది తారనే... అక్కడ అడుగుపెట్టను.. సమంత షాకింగ్ కామెంట్స్
సమంత అక్కినేని దక్షిణాదిలో అగ్రశ్రేణి కథానాయిక. తమిళ, తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలో భారీ సక్సెస్లతో దూసుకెళ్తున్నారు. ఓ బేబీ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. ఎప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు అనే ప్రశ్నకు సమంత ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇంతకు బాలీవుడ్పై సమంతకు ఎలాంటి అభిప్రాయం ఉందంటే..
బాలీవుడ్లోకి అడుగుపెట్టను
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు వెళ్లే ఆలోచన లేదు. నేను చెన్నై నుంచి వచ్చాను. నేను దక్షిణాది తారను చెప్పుకోవడానికి గర్వపడుతాను. నా ప్రాంతపు ప్రజలు, నా ప్రాంతపు సంప్రదాయాలంటే నాకు ఇష్టం. ఇక్కడి ప్రజల సినీ అభిరుచులు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఈ ప్రాంతం సినిమాల్లోనే ఉండాలనుకొంటున్నాను. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశం లేదు అని అన్నారు.
దక్షిణాది అభిరుచులే నాకు ముఖ్యం
దశాబ్దకాలానికి పైగా కెరీర్ ఉన్నప్పటికీ.. ప్రేక్షకుల అభిరుచి ప్రకారమే నటిస్తుంటాను. వారి ఎలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారనే విషయాన్ని తెలుసుకొంటాను. అందుకనుగుణంగా సినిమాల్లో నటిస్తుంటాను. ఇక్కడి ప్రేక్షకులు కేవలం నా క్యారెక్టర్ మాత్రమే ఇష్టపడుతారు. మిగితా విషయాలు పక్కన పెట్టేస్తుంటారు అని సమంత చెప్పింది.
బాలీవుడ్ ఓ కొత్త ప్రపంచం
బాలీవుడ్ నాకు అర్థం కాని కొత్త ప్రపంచంలా కనిపిస్తుంది. అందులో నేను ఇమడలేననే ఫీలింగ్ నాకు ఉంది. బాలీవుడ్ సినీ పరిశ్రమ గురించి నాకు అసలే తెలియదు అని సమంత అభిప్రాయపడ్డారు. అందుకే నేను బాలీవుడ్లో రాణించలేను.. దక్షిణాది సినిమా పరిశ్రమనే కరెక్ట్ అని నమ్ముతాను అని సమంత అన్నారు.
ఓ బేబీ సినిమాలో 70 ముసలి పాత్రలో
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏం మాయ చేశావే సినిమాతో కెరీర్ను ఆరంభించిన సమంత రుత్ ప్రభు..ఇటీవల కాలంలో తమిళంలో తెరీ, రంగస్థలం, మెర్సల్, సూపర్ డీలక్స్ లాంటి సూపర్ హిట్లను చేజిక్కించుకొన్నారు. టాలీవుడ్ హీరో నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత అక్కినేనిగా మారారు. ప్రస్తుతం ఓ బేబీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొరియన్ మూవీ మిస్ గ్రానీ సినిమా ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో 70 ఏళ్ల ముసలి పాత్రలో సమంత కనిపిస్తారు. ఈ చిత్రం జూలై 5వ తేదీన రిలీజ్ కానున్నది.