Don't Miss!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రభాస్ తో మొదటిసారి నటించబోతున్న సీనియర్ హీరోయిన్.. లక్కీ ఆఫర్?
సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోయిన్స్ నుంచి పెద్ద హీరోయిన్స్ వరకు అందరూ కూడా స్టార్ హీరోలతో సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై కూడా అగ్ర హీరోయిన్స్ స్పెషల్ గా ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ లాంటి స్టార్స్ తో ఒక్క చాన్స్ వచ్చినా కూడా చాలని అనుకుంటున్నారు. స్పెషల్ సాంగ్స్ లో కనిపించడానికి సైతం సై అంటున్నారు.
గత పదేళ్ల నుంచి ఉంటున్న స్టార్ హీరోయిన్స్ తమన్నా, కాజల్, అనుష్క్, తాప్సి వంటి వారు ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నవారే. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీలు కూడా డార్లింగ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో నటించిన సమంత మాత్రం రెబల్ స్టార్ తో ఒక్కసారి కూడా నటించలేదు. అయితే త్వరలోనే ఆమె కూడా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలో సమంత కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో సమంత ఒక అరగంట పాటు స్పెషల్ పాత్రలో కనిపిస్తుందట.
ఇదివరకే నాగ్ అశ్విన్ తో సమంత మహానటి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ ప్రాజెక్ట్ K 2024 విడుదల కానుంది.