Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పదేళ్ల ప్రేమ.. రెండేళ్ల వివాహా జీవితమన్న సమంత.. శుభాకాంక్షల వెల్లువ
ఏ మాయ చేసావే చిత్రంలో జెస్సీ ప్రేమను పొందడానికి కార్తీక్ ఎంత తపనపడ్డాడో తెలుగు నాట అందరికీ తెలిసిందే. అయితే అది సినిమా కోసమే అయి ఉంటుందని అంతా అనుకున్నారు అప్పుడు. కానీ తీరా చూస్తే.. జెస్సీ, కార్తీక్ ఒక్కటయ్యారు. చక్కగా కాలాన్ని గడిపేస్తున్నారు.
సమంత, నాగ చైతన్యకు పెళ్లై రెండేళ్లైంది. ఈ సందర్భంగా వీరిద్దరికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వెండితెరపై భార్యాభర్తలుగా నటించిన ఈ జంట నిజజీవితంలోనూ ఒక్కటై అభిమానులందర్నీ ఆశ్చర్యపరిచారు.
మొదటి చిత్రంతోనే మొదలు..
సమంత, నాగ చైతన్య కలిసి నటించిన ఏ మాయ చేశావేచిత్రం నుంచి వీరి మధ్య స్నేహం మొదలైంది. అది క్రమక్రమంగా పెరుగుతూ ప్రేమగా మారింది. చివరకు రెండు కుటుంబాల ఇష్టంతో పెళ్లిగా మారింది. వారి కథ సుఖాంతం అయింది. అయితే వారి ప్రేమకు పదేళ్లని సమంత పేర్కొంది. అంత కాలం వారిద్దరి వ్యవహారాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.
జంటగా నటించిన చిత్రాలు..
ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం చిత్రాల్లో జంటగా నటించి బెస్ట్ పెయిర్ గా అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్నాక కలిసి నటించిన చిత్రం మజిలీ. ఈ మూవీ వీరి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలు వీరిద్దరి నటలకు మంచి ప్రశంసలు వచ్చాయి.
పెళ్లాయ్యాక జోరు పెంచిన సమంత..
పెళ్లాయ్యాక ఎవరైనా సినిమాలు మానేస్తారు కానీ..సమంత మాత్రం రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది. వరుస హిట్స్తో ఫుల్ స్వింగ్లో ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ సూపర్ స్టార్ ట్యాగ్ కూడా చేజిక్కించుకునేలా ఉంది. తమిళ,తెలుగు భాషల్లో వరుస విజయాలతో సమంత జెట్ స్పీడ్లో సినిమాలను చేసేస్తోంది. రీసెంట్ గా ఓ బేబీ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
వివాహా వార్షికోత్సవ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్..
సమంత, నాగ చైతన్యలకు పెళ్లై నేటికి రెండేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. స్ట్రాంగర్.. స్ట్రాంగర్.. పదేళ్ల ప్రేమ.. రెండేళ్ల వివాహాం... అంటూ ఇన్నేళ్లలో బెస్ట్ మెమోరిస్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
|
వెల్లువల శుభాకాంక్షలు..
సమంత పెట్టిన ఈ పోస్ట్కు అభిమానులే కాదు..తోటీ హీరోయిన్లు, డైరెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్, నందిని రెడ్డి, హన్సిక, నీరజ కోనలాంటి ఎంతో మంది విషెస్ తెలిపారు. రానా కూడా వీరికి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రానా పెట్టిన ఈ పోస్ట్ కు నమ్రతా శిరోద్కర్ రిప్లై ఇస్తూ.. సమంత, నాగచైతన్యలకు విషెస్ తెలిపింది.