Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
9 ఏళ్లలో జీవితమే మారిపోయింది, భావోద్వేగానికి గురైన సమంత!
టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమై సరిగ్గా 9 సంవత్సరాలైంది. ఆమె నటించిన తొలి చిత్రం ఏ మాయ చేశావే ఫిబ్రవరి 26, 2010లో విడుదలవ్వగా ఈ సినిమా ద్వారానే నాగ చైతన్యతో ఆమెకు పరిచయం ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఏ మాయ చేశావే నిర్మాత, మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... 'ఈ సినిమా విడుదలై తొమ్మిదేళ్లు అవుతోంది. అంతా నిన్న జరిగినట్టుగా ఉంది. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ చీర్స్ అంటూ ట్వీట్ చేశారు.
|
నా జీవితాన్ని మార్చేసిన అవకాశం
మంజుల ట్వీట్పై సమంత స్పందిస్తూ.. `నా జీవితాన్ని మార్చేసే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్` అంటూ రిప్లై ఇచ్చారు. అభిమానుల మద్దతు లేకపోతే నాకు ఈ స్థానమే లేదు` అని సమంత చెప్పుకొచ్చారు.
|
వరుస విజయాలతో దూసుకెళ్లిన సమంత
తొలి సినిమాతోనే హిట్ కొట్టిన సమంత.. ఆ తర్వాత వరసు విజయాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగారు. ఒకానొక సందర్భంలో సమంత ఉంటేనే సినిమా హిట్టు అనే పరిస్థితి కొనసాగింది. అవకాశాలు పెరగడంతో రెమ్యూనరేషన్ పెంచేసి టాప్ రేంజికి దూసుకెళ్లింది.
జీవితాన్ని సెట్ చేసిన ఒక్క సినిమా
‘ఏమాయ చేశావే' సినిమాకు సమంత సైన్ చేసేపుడు ఇది తన ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్ను కూడా మార్చేస్తుందని బహుషా ఊహించి ఉండదు. ఇందులో నటించిన చైతూతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఆపై ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సినిమాల్లో కలిసి నటిస్తున్నారు.
సమంత-చైతూ..
పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి సినిమా ‘మజిలీ'. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. . నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తునన ఈ చిత్రం ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.