Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హరికృష్ణ మరణం: సమంత పొరపాటుకు మూల్యం... గట్టిగా క్లాస్ పీకారు!
మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు, జూ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులంతా హరికృష్ణ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. ఇతర స్టార్ల మాదిరిగానే హీరోయిన్ సమంత కూడా హరికృష్ణ మరణంపై ట్వీట్ చేశారు. హరికృష్ణ మరణంతో షాకయ్యానని, ఇదొక విషాద సంఘటన అని... ఈ క్లిష్ట సమయంలో ఆయన ఫ్యామిలీకి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పోస్టు పెట్టారు.
సమంత చేసిన తప్పేంటి?
తెలుగునాట సాధారణంగా పెద్దలను పేరు పెట్టి సంబోధించినపుడు గౌరవార్థకంగా పేరు చివర ‘గారు' అనే పదం చేరుస్తారు. అయితే సమంత తన పోస్టులో ‘గారు' అని లేకుండా హరికృష్ణ (#RIPHarikrishna)అని పెట్టడంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు.
|
సమంతకు గట్టిగా క్లాస్ పీకారు
సమంత పోస్టుతో హర్ట్ అయిన నందమూరి ఫ్యాన్స్ ‘పెద్దవాళ్లను గౌరవించడం నేర్చుకో' అంటూ సమంతకు గట్టిగా క్లాస్ పీకారు. కొందరైతే తిట్ల వర్షం కురిపించారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన సమంత తన తప్పును సరిదిద్దుకుంది.
|
తెలియక చేసిన తప్పకు ఇంత రాద్దాంతం ఎందుకు?
సమంత తెలియక తప్పు చేసిందని... ఆమె తెలుగు వ్యక్తి కాకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది. ఈ విషయాన్ని సున్నితంగా చెప్పాల్సింది. దీనిపై ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు. హరికృష్ణగారి మీద గౌరవం ఉండటం వల్లే ఆమె ట్వీట్ చేసిన విషయం గుర్తుంచుకోవాలని కొందరు సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు.
నందమూరి హరికృష్ణ
హరికృష్ణ కారు ప్రమాదానికి గురికావడానికి కారణం అతి వేగమే అని పోలీసులు తేల్చారు. ప్రమాద సమయంలో కారు 160 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని చెప్పారు. సీటు బెల్టు పెట్టుకుని ఉంటే... ప్రమాద తీవ్రత తగ్గేదని అన్నారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాదు నుంచి నెల్లూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. హరికృష్ణ తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని మెహదీపట్నంలోని నివాసానికి తరలించారు. గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్తానం స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి.