Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మొన్న అలా నేడు ఇలా.. తలకిందులుగా వేలాడుతోన్న సమంత
సమంత ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకుంటోంది. అందంతో పాటు ఆరోగ్యంపైనా దృష్టి పెట్టింది. అందుకే స్వయంగా రంగంలోకి దిగి సేంద్రియ వ్యవసాయం చేస్తోంది. ఇంటిపైనే ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంది. రసాయనిక ఎరువులు వాడకుండా సహజ సిద్దంగా కూరగాయలను పండిస్తూ.. వంటలు వండటం కూడా నేర్చేసుకుంటోంది. ఈ మేరకు సమంత చేసిన వంటకాలు, తాను పెంచుతున్న మొక్కలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఇక ఈ లాక్ డౌన్ సమయాన్ని భార్యభర్తలిద్దరూ ఎంతో సరదాగా వాడుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ఫిట్ నెస్పై బాగానే శ్రద్ద వహిస్తున్నారు. యోగా చేస్తూ కొత్త కొత్త ఆసనాలు వేస్తున్నారు. అంతే కాకుండా ఇంటి నుంచే యాడ్స్ షూట్స్ కూడా చేసేస్తున్నారు. ఏరియల్కు సంబంధించి సమంత షేర్ చేసిన ఫోటోలు, పెట్టిన క్యాప్షన్ తెగ వైరల్ అయింది. క్యూట్ కపుల్స్ అంటూ నెటిజన్లు ఆ ఫోటోను చూసి ముచ్చటపడ్డారు. తాజాగా సమంత తలకిందులుగా వేలాడుతున్న ఫోటోను షేర్ చేసింది.
ఆ మధ్య సమంత జిమ్లో ఎంతగా కష్టపడిందో అందరికీ తెలిసిందే. వంద కేజీల బరువును కూడా అవలీలగా ఎత్తేసింది. సమంత ఏదైనా మొదలుపెడితే మధ్యలో వదిలేసే రకం కాదు. అవి యోగా ఆసనాలైనా, జిమ్నాస్టిక్స్ అయినా, వంటలైనా సరే. మొన్న గాల్లో తేలిన ఆసనాన్ని షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా తాళ్ల సాయంతో తలికిందులుగా వేలాడుతున్న ఫోటోను షేర్ చేసింది. సమంత ఫ్రెండ్ శిల్పా రెడ్డికి కరోనా రావడంతో అందరూ భయాందోళనకు లోనయ్యారు. సమంతకు కూడా కరోనా సోకిందనే వార్తలు వట్టి రూమర్స్ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.