Don't Miss!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తన బిడ్డ గురించి సమీరా రెడ్డి నోట ఊహించని వ్యాఖ్య, నెటిజన్ల విమర్శలు!
హీరోయిన్ సమీరా రెడ్డి జులై 12న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన బేబీ బంప్ ఫోటోలతో సందడి చేస్తున్న ఈ మాజీ హీరోయిన్ అండర్ వాటర్ బికినీ ఫోటో షూట్ చేసి అభిమానులను ఆశ్చర్య పరిచింది.
బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ... సోషల్ మీడియాలో అభిమానుల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మీడియాకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఓ ప్రశ్నకు సమీరా ఇచ్చిన సమాధానం అందరూ విస్మయం చెందేలా చేసింది.
నా బిడ్డ నల్లగా లేదు
మీ బిడ్డ ఎవరి పోలిక అనే ప్రశ్నకు సమీరా రెడ్డి స్పందిస్తూ.. ‘నా బిడ్డ నాలా నల్లగా లేదు. తెల్లగా, ముద్దుగా ఉన్నందుకు హ్యాపీగా ఉంది' అంటూ సమాధానం ఇచ్చారు. సమీరా రెడ్డి తన బిడ్డ రంగును పోలుస్తూ ఇలాంటి కామెంట్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.
సమీరా తీరుపై విమర్శలు
తన బిడ్డ శరీర రంగు గురించి సమీరా రెడ్డి ప్రస్తావించడం విమర్శకులకు దారి తీసింది. ఒక బాధ్యత గల సెలబ్రిటీ అయి ఉండి ఇలాంటి పోలిక చేయడం సరైంది కాదని, ఆమె అలా మాట్లాడటం నల్లగా ఉండే వారిని అవమానించడమే అని, ఆమె ఇలా వ్యాఖ్యానించి ఉండకూడదు అని కొందరు అభిప్రాయ పడ్డారు.
రెండో సంతానం
సమీరా రెడ్డి-అక్షయ్ వర్దె దంపతులకు ఈ పాప రెండో సంతానం. వారికి ఇప్పటికే హన్స్ వాద్రే అనే మూడేళ్ల కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. సమీరా రెడ్డి తాన గర్భం దాల్చినప్పటి నుంచి బాడీ పాజిటివిటీ పేరుతో తన ప్రెగ్నెన్సీ గురించి వరుస పోస్టులు చేస్తూనే ఉన్నారు.
సమీరా రెడ్డి
తెలుగు ఫ్యామిలీకి చెందిన సమీరా రెడ్డి ముంబైలో పుట్టి పెరిగింది. మోడలింగ్ రంగం నుంచి సినిమా రంగం వైపు అడుగులు వేసిన ఆమె 2002లో ‘మైనే దిల్ తుజ్కో దియా' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. 2005లో వచ్చిన మెగాస్టార్ మూవీ ‘జై చిరంజీవ' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటరయ్యారు. తర్వాత ఎన్టీఆర్తో కలిసి ‘అశోక్' మూవీలో హీరోయిన్గా చేశారు. ఆమె చివరగా 2013లో సుదీప్ హీరోగా వచ్చిన కన్నడ చిత్రం ‘వరదనాయక'లో నటించారు. 2014లో అక్షయ్ వార్దెను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు.