Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ విషయంలో తమన్నాకే కలిసొచ్చిన లక్.. రష్మిక మందన్నా ఫ్యాన్స్కు మింగుడు పడని వార్త.!
రష్మిక మందన్నా.. నాగశౌర్య నటించిన 'ఛలో' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కన్నడ నటి. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో పాటు ఆమె అందం, అభినయానికి మంచి పేరు వచ్చింది. ఈ మూవీ తర్వాత రష్మిక నటించిన 'గీత గోవిందం' కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంత ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటోంది. అది కూడా స్టార్ హీరోల సినిమాల్లో కావడంతో అమ్మడు మంచి ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా పోస్ట్..? వివరాల్లోకి వెళితే...
అందరి ఛాయిస్ రష్మికనే
ప్రస్తుతం రష్మిక మందన్నా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాలో నటిస్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల రష్మికకు సంబంధించిన ఓ పాటను విడుదల చేశారు. దీనితో పాటు ఆమె నితిన్ సరసన ‘భీష్మ' అనే మూవీలోనూ హీరోయిన్గా చేస్తోంది.
ఆ సినిమాలో ఖాకీ డ్రెస్ వేసుకుంటోంది
రష్మిక మందన్నా ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు మరికొన్నింటికి సంతకాలు చేసేసింది. అందులో అల్లు అర్జున్ - సుకుమార్ సినిమా ఒకటి. ఈ సినిమాలో ఆమె ఫారెస్ట్ ఆఫీసర్గా కనిపించనుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ మూవీలో రష్మిక పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ ఆఫర్ను వదులుకుంది
తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తున్న రష్మికకు బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చింది. అది కూడా స్టార్ హీరో షాహీద్ కపూర్ పక్కన నటించే అవకాశం. అయితే, దీనిని ఆమె వదులుకున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ సినిమా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సూపర్ హిట్ ‘జెర్సీ' రీమేక్గా రాబోతుంది.
సరిలేరులో అలాంటి పాత్రే
మహేశ్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'లో రష్మిక హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదని, అందుకే ఆమెను టీజర్లో చూపించలేదని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం ప్రకారం రష్మిక పాత్ర కీలకంగా ఉంటుందట. ఈ సినిమా కథను మలుపు తిప్పేది ఆమె పాత్రేనని సమాచారం.
ఆ విషయంలో తమన్నాకే కలిసొచ్చిన లక్
ఈ సినిమా కోసం రష్మిక రూ. 80 లక్షలు రెమ్యూనరేషన్గా తీసుకుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందులో స్పెషల్ సాంగ్లో నటించిన తమన్నా మాత్రం ఊహించని విధంగా రూ. 40 లక్షలు చార్జ్ చేసిందట. అంటే ఐదు నిమిషాల పాటకు తమన్నా ఇంత తీసుకుంటే.. సినిమా మొత్తం ఉన్న రష్మిక మాత్రం తక్కువే అందుకుందన్న టాక్ వినిపిస్తోంది.