Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Sherlyn Chopra కు షాక్: శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా 50 కోట్ల పరువు నష్టం దావా
బాలీవుడ్ శృంగార తార షెర్లీన్ చోప్రా, రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి మధ్య వివాదం ముదిరి పాకాన పడుతున్నది. రాజ్ కుంద్రా తనను లైంగిక వేధించాడు. తనను మానసికంగా క్షోభకు గురిచేశాడని ఆరోపిస్తూ ముంబైలో షెర్లీన్ చోప్రా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా మోసగాళ్లు అంటూ ఆరోపించింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ముంబై పోలీసులకు కోరారు. తమపై ఆరోపణలు చేస్తూ పరువుకు భంగం కలిగించారంటూ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా తీవ్రంగా స్పందించారు.
పబ్లిక్ డొమైన్లలో తమ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిందుకు షెర్లీన్ చోప్రాపై పరువు నష్టం దావా వేశారు. తమ పరువు నష్టానికి రూ.50 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసులు పంపారు. తమ తరఫు న్యాయవాది ప్రశాంత్ పీ పాటిల్ ద్వారా నోటీసులు పంపారు.
షెర్లీన్ చోప్రాపై పరువు నష్టం దావా పంపిన తర్వాత శిల్పాశెట్టి తరఫు లాయర్ మీడియాలో స్పందిస్తూ.. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిపై షెర్లీన్ చోప్రా నిరాధార ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలు అవాస్తవం, నిరాధారం, ఫేక్ అంటూ ఖండించారు. డబ్బును లాగేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలు చేశారు అని తెలిపారు.
పోర్న్ రాకెట్ కేసులో భాగంగా రాజ్ కుంద్రాపై పలు అరోపణలు షెర్లీన్ చోప్రా చేశారు. కాబట్టి ఆమె నుంచి వాగ్మూలం తీసుకోవడానికి ఆమెను తమకు అప్పగించాలని పోలీసులు కోర్టును వేడుకొన్నారు. దాంతో షెర్లీన్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. గతంలో పోర్నోగ్రఫి కంటెంట్ క్రియేషన్ వ్యవహారంలో రాజ్ కుంద్రాతో లింకులు ఉన్నాయనే ఆరోపణలపై షెర్లీన్ చోప్రాకు సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలో షెర్లీన్ చోప్రా బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. దాంతో వారి మధ్య తీవ్ర వివాదం నెలకొన్నది.