Don't Miss!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
Sherlyn Chopra కు షాక్: శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా 50 కోట్ల పరువు నష్టం దావా
బాలీవుడ్ శృంగార తార షెర్లీన్ చోప్రా, రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి మధ్య వివాదం ముదిరి పాకాన పడుతున్నది. రాజ్ కుంద్రా తనను లైంగిక వేధించాడు. తనను మానసికంగా క్షోభకు గురిచేశాడని ఆరోపిస్తూ ముంబైలో షెర్లీన్ చోప్రా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా మోసగాళ్లు అంటూ ఆరోపించింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ముంబై పోలీసులకు కోరారు. తమపై ఆరోపణలు చేస్తూ పరువుకు భంగం కలిగించారంటూ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా తీవ్రంగా స్పందించారు.
పబ్లిక్ డొమైన్లలో తమ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిందుకు షెర్లీన్ చోప్రాపై పరువు నష్టం దావా వేశారు. తమ పరువు నష్టానికి రూ.50 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసులు పంపారు. తమ తరఫు న్యాయవాది ప్రశాంత్ పీ పాటిల్ ద్వారా నోటీసులు పంపారు.
షెర్లీన్ చోప్రాపై పరువు నష్టం దావా పంపిన తర్వాత శిల్పాశెట్టి తరఫు లాయర్ మీడియాలో స్పందిస్తూ.. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిపై షెర్లీన్ చోప్రా నిరాధార ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలు అవాస్తవం, నిరాధారం, ఫేక్ అంటూ ఖండించారు. డబ్బును లాగేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలు చేశారు అని తెలిపారు.
పోర్న్ రాకెట్ కేసులో భాగంగా రాజ్ కుంద్రాపై పలు అరోపణలు షెర్లీన్ చోప్రా చేశారు. కాబట్టి ఆమె నుంచి వాగ్మూలం తీసుకోవడానికి ఆమెను తమకు అప్పగించాలని పోలీసులు కోర్టును వేడుకొన్నారు. దాంతో షెర్లీన్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. గతంలో పోర్నోగ్రఫి కంటెంట్ క్రియేషన్ వ్యవహారంలో రాజ్ కుంద్రాతో లింకులు ఉన్నాయనే ఆరోపణలపై షెర్లీన్ చోప్రాకు సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలో షెర్లీన్ చోప్రా బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. దాంతో వారి మధ్య తీవ్ర వివాదం నెలకొన్నది.