Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పెళ్లి రోజు సందర్భంగా రెచ్చిపోయిన సాగరకన్య.. బికినీ పిక్స్ వైరల్, చనిపోయేవరకు అంటూ!
బాలీవుడ్ అందాల తార శిల్ప శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు 9వ మ్యారేజ్ యానవర్సరీని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ కోసం దంపతులిద్దరూ మాల్దీవ్స్ కు వెకేషన్ కు వెళ్లారు. నాలుగు పదుల వయసులో కూడా ఈ సాగర కన్య అందంతో మతిపోగొడుతోంది. వెకేషన్ సందర్భంగా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్త ఇంటర్ నెట్ లో వైరల్ అయిపోయాయి. తమ మ్యారేజ్ డేని ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
చనిపోయే వరకు
నీవు అందించే ప్రేమ, నా కోసం తీసుకునే జాగ్రత్త నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. మనమిద్దరం ఒకరికోసం ఒకరం జన్మించాం. చనిపోయే వరకు నీకు ప్రేమ అందిస్తూనే ఉంటా. మరణం తరువాత కూడా జీవితం ఉంటె అప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటా అంటూ శిల్పాశెట్టి తన భర్తని ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ఘాటైన ప్రేమలో
పెళ్లి రోజు సంద్భరంగా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులు ఘాటైన ప్రేమలో మునిగి తేలుతున్నారు. లోకాన్నే మరచిపోయినట్లుగా భార్యని ముద్దుల్లో ముంచెత్తుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యారేజ్ యానవర్సరీ సెలబ్రేషన్స్ కు సంబందించిన పలు ఫోటోలని శిల్పా శెట్టి తన ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది.
బికినీ అందాలు
శిల్పా శెట్టి మాల్దీవ్స్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న బికినీ ఫోటోలు షేర్ చేసింది. నాలుగు పదుల వయసులో కూడా శిల్పా అందంతో అదరగొడుతోంది నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. పెళ్లయ్యాక వెండితెరపై కనిపించడం మానేసిన ఈ పొడుగు కాళ్ళ సుందరి సోషల్ మిడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటోంది.
2009లో
రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి 2009 లో వివాహం చేసుకున్నారు. రాజ్ కుంద్రా లండన్ లో ప్రముఖ వ్యాపార వేత్తగా ఉన్నారు. ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వీరి పరిచయం జరిగింది. ఒకరినొకరు ఇష్టపడ్డాక పెళ్ళికి పచ్చజెండా ఊపారు. ప్రస్తుతం శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. తెలుగు ప్రేక్షకులకు శిల్పా శెట్టి సాగర కన్యగా ఎప్పటికీ గుర్తుంటుంది. వెంకటేష్ సరసన సాహసవీరుడు సాగర కన్య, నాగార్జున సరసం ఆజాద్, బాలయ్య సరసన బలేవాడివి బాసు చిత్రాలలో నటించింది.