Don't Miss!
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్కే సాధ్యం- విలియమ్సన్
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పరస్పర అంగీకారంతోనే అలా జరుగుతుంది.. మీటూ ఆరోపణలు కొట్టి పారేసిన బిగ్ బాస్ విజేత!
హీరోయిన్లు, హీరోలు అంతా ఏకమై బాలీవుడ్ మీటూ ఉద్యమానికి మద్దత్తు తెలుపుతున్నారు. కానీ బిగ్ బాస్ 11 విజేత శిల్ప షిండే మాత్రం విభిన్నంగా స్పందించింది. పలువురు నటీమణులు మీటూ పేరుతో చేస్తున్న ఆరోపణలని శిల్ప షిండే కొట్టిపారేసింది. సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తే నిజానిజాలు బయట పడుతాయి.
ఎప్పుడో జరిగిన విషయాలని ఇప్పుడు ప్రస్తావించడం వివాదాలు రేపడం కోసమే అవుతుందని శిల్పా షిండే తెలిపింది. అయినా ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలన్నీ పరస్పర అంగీకారంతోనే జరుగుతాయి. అనుమతి లేకుండా ఇండస్ట్రీలో ఎవరూ ఎవరిని ఏమీ చేయరని తెలిపింది. పరస్పర అవగాహన వల్ల ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడుతుంది. దానికి అత్యాచారం అని పేరుపెట్టి రాద్ధాంతం చేయడం తగదు అని శిల్ప షిండే తెలిపింది.
సినిమారంగం, టివి రంగం చెడ్డవి కావు. కొందరు కావాలనే పేరు చెడగొడుతున్నారని శిల్పా షిండే ఆగ్రహం వ్యక్తం చేసింది. తనుశ్రీ దత్త ఆరోపణలతో మొదలైన మీటూ ఉద్యమం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. మీటూ ఉద్యమానికి ప్రముఖులంతా మద్దత్తు తెలుపుతుంటే.. శిల్పా షిండే స్పందన విభిన్నంగా ఉంది.