twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ మరో బంపర్ ఛాన్స్ కొట్టేసింది

    |

    'జెర్సీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ తొలి ప్రయత్నంలో విజయం తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో కేవలం అందం పరంగానే కాదు... అందం పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది. ఈ హిట్ తర్వాత శ్రద్ధా శ్రీనాథ్‌కు తెలుగులో వరుస అవకాశాలు వరిస్తున్నాయి.

    shraddha-srinath-in-abhimanyudu-sequel

    తాజా సమాచారం ప్రకారం... విశాల్ హీరోగా తెరకెక్కే మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా ఖరారైనట్లు తెలుస్తోంది. విశాల్ సూపర్ హిట్ మూవీ 'అభిమన్యు' చిత్రానికి త్వరలో సీక్వెల్ రాబోతోంది. ఇందులో ఆమె ఫీమేల్ లీడ్‌గా ఎంపికైనట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

    ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించబోతున్నారు. తమిళంతో పాటు తెలుగులో అభిమన్యు సీక్వెల్ విడుదల కాబోతోంది. ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ రుస్తం, గోదా అనే కన్నడ సినిమాలతో పాటు తమిళంలో నేర్కొండ పార్వాయ్ చిత్రం చేస్తోంది. తెలుగులో జోడీ అనే చిత్రంలో నటిస్తోంది.

    Shraddha Srinath in Abhimanyudu sequel

    లా చదివిన శ్రీద్ధా శ్రీనాథ్ సినిమాల్లోకి రాక ముందు... బెంగుళూరులోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి లాయర్‌గా పని చేశారు. తర్వాత ఫెంచ్ రిటైల్ కంపెనీకి లీగల్ అడ్వైజర్‌గా సేవలు అందించారు. తన జాబ్ చేస్తూనే నాటకాలు వేయయడం, వాణిజ్య ప్రకటనల్లో నటించడం మొదలు పెట్టారు.

    ఈ క్రమంలోనే ఆమె 2015లో కన్నడ 'యూటర్న్' మూవీ ఆడిషన్స్‌కు వెళ్లి సెలక్ట్ అయ్యారు. ఆ మూవీ మంచి విజయం అందుకోవడంతో వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు. ఇప్పటి వరకు 12 సౌత్ చిత్రాలతో పాటు ఒక హిందీ చిత్రం చేశారు. ప్రస్తుతం 5 చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

    English summary
    Shraddha Srinath has been roped in as the female lead in Vishal’s upcoming film which is the sequel to his hit film Abhimanyudu. The official confirmation about the same will be made soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X