Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘సలార్’ షూటింగ్పై శృతి హాసన్ కామెంట్స్: అసలైంది మిగిలే ఉందంటూ వివరణ
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'సలార్'. కేజీఎఫ్ వంటి భారీ చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ సింగరేణి బొగ్గు గనుల్లో పూర్తయింది. ఇక, రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది అనుకునే లోపు కరోనా సెకెండ్ వేవ్ రూపంలో అడ్డంకి ఏర్పడింది. దీంతో ఈ సినిమా చిత్రీకరణ ఆపేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోన్న శృతి హాసన్ షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తాజాగా ఓ నేషనల్ ఛానెల్తో మాట్లాడిన శృతి హాసన్.. 'సలార్ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ మాత్రమే పూర్తైంది. ఇందులో నేను కూడా ఓ రోజు పాల్గొన్నాను. ఇంకా నా పార్ట్ చాలా భాగం షూట్ చేయాల్సి ఉంది. సెకెండ్ షెడ్యూల్ గుజరాత్లో జరగాల్సి ఉన్నా.. కరోనా వల్ల వాయిదా పడింది. అయితే, ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేసి హైదరాబాద్ షెడ్యూల్ను ముందుకు తీసుకొస్తున్నారు. త్వరలోనే ఇది పున: ప్రారంభం అవుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ప్రభాస్ పక్కన నటించడం ఎంతో సంతోషానిస్తోంది' అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
ఇక, 'సలార్' మూవీలో శృతి హాసన్ జర్నలిస్టుగా నటిస్తుందని ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎంతో సాహసోపేత రోల్ ఇది అని అంటున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. ఈ భారీ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాను రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని 2022 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.