Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
క్లీవేజ్ షోతో సెగలు రేపుతున్న శృతి.. హాట్ ఫొటోలకు ఫిదా అవడం ఖాయం
శృతీ హాసన్.. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన పేరింది. విశ్వ నాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. సింగర్గా, యాక్టర్గా అనతి కాలంలోనే బడా ఇమేజ్ను సొంతం చేసుకుంది. తనకున్న మల్టిపుల్ టాలెంట్తో దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్లోకీ అడుగు పెట్టింది.
కెరీర్ ఆరంభంలో చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన శృతి.. ప్రేమలో పడిన తర్వాత మాత్రం తన కెరీర్కు తాత్కాలికంగా పుల్స్టాప్ పెట్టేసింది. ఇంగ్లండ్ గాయకుడు మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడడంతో తన సినీ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకుంది. అతడికి బ్రేకప్ చెప్పిన తర్వాత మాత్రం శృతి కెరీర్పై దృష్టి సారిస్తోంది. ఇటీవలే ఆమె పలు చిత్రాలు చేయడానికి సైతం సంతకాలు చేసేసింది.
ఇందులో భాగంగానే తమిళంలో విజయ్ సేతుపతి సరసన 'లాభం' అనే సినిమా చేస్తోంది. దీనితో పాటు అక్కడ మరికొన్ని సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే, తెలుగులోనూ పలు చిత్రాలు చేయడానికి సిద్ధమైంది. ఇవి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే శృతీ హాసన్ తాజాగా లండన్లో పర్యటించింది.
ఈ సందర్భంగా ఆమె దిగిన ఫొటలోను 'లండన్ నైట్స్' పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలలో శృతీ క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. అంతేకాదు, తన డ్రెస్, బ్లాక్ లిప్స్టిక్తో సెగలు రేపుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలకు పాజిటివ్గా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వీటిని కమల్ ఫ్యాన్స్ కూడా తమ పేజీల్లో షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటున్నారు.
శృతీ హాసన్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎందరో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. వీటిలో చాలా వరకు హిట్లే ఉన్నాయి. అయితే, 2017లో వచ్చిన 'కాటమరాయుడు' తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.