Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భర్తతో విడిపోయినా ఎంజాయ్ చేస్తున్నా.. అందుకే వ్యభిచారిణిలా: సంచలన విషయాలు లీక్ చేసిన శ్వేత బసు
సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఎనలేని క్రేజ్ను అందుకుని స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతుంటారు. అయితే, ఆరంభంలోనే విపరీతమైన ఫాలోయింగ్ వచ్చినా.. దాన్ని నిలబెట్టుకోలేక కెరీర్ను ప్రశ్నార్థకం చేసుకునే వాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో శ్వేతా బసు ప్రసాద్ ఒకరు. హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి.. ఎన్నో వివాదాల కారణంగా సినిమాలకు దూరమైందామె. ఈ నేపథ్యంలో తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన విషయాలు లీక్ చేసింది శ్వేత. ఆ వివరాలు మీకోసం!
సంయుక్త హెగ్డే గ్లామరస్ ఫోటో షూట్.. ప్రియుడితో అత్యంత సన్నిహితంగా
బాలీవుడ్ నుంచి టాలీవుడోలోకి
బీహార్కు చెందిన శ్వేతా బసు ప్రసాద్ చాలా చిన్న వయసులోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. 'ఫిర్ బీ దిల్ హై హిందుస్థానీ' అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్ముడు.. ఆ తర్వాత 'మక్దీ', 'ఇక్బాల్', 'దర్నా జరూరీ హై' వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ నటించిన 'కొత్త బంగారు లోకం' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయం అయింది.
‘బంగారు లోకం' ఒక్కటే సక్సెస్
'కొత్త బంగారు లోకం' తర్వాత తెలుగులో 'కాస్కో', 'కళావర్ కింగ్', 'రైడ్', 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ, అవేమీ ఆమెకు విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి బైబై చెప్పేసింది. అప్పటి నుంచి తమిళం, హిందీ చిత్రాల్లోనే నటించింది. అంతేకాదు, బుల్లితెరపై వచ్చిన ఎన్నో కార్యక్రమాల్లోనూ భాగమై పాపులరిటీ పెంచుకుంది.
ఆ కేసులో చిక్కుకున్న బ్యూటీ
కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో ఓ కేసులో చిక్కుకుంది శ్వేతా బసు ప్రసాద్. అప్పట్లో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అప్పుడు ఆమెను పలువురు విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. ఆ సమయంలో చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ ఈ హీరోయిన్ డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. దీంతో అవకాశాలు రాక సినిమాలకు దూరమైంది.
డైరెక్టర్తో వివాహం.. విడాకులు
ఎన్నో వివాదాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతోన్న సమయంలో రోహిత్ మిట్టల్ అనే దర్శకుడు శ్వేతా బసు ప్రసాద్కు అండగా నిలిచాడు. అంతేకాదు, ఆమెను ప్రేమించి వివాహం కూడా చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె జీవితంలో మార్పులు వచ్చాయి. ధైర్యంగా బయటి ప్రపంచానికి రాగలిగింది. కానీ, ఎనిమిది నెలలకే భర్తకు విడాకులు ఇచ్చి దూరమైపోయింది శ్వేతా.
సంచలన విషయాలు లీక్ చేసింది
చిన్న వయసులోనే స్టార్డమ్ను అందుకుని.. ఆ తర్వాత వరుస ఎదురుదెబ్బలు.. ఇలా కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది శ్వేతా బసు ప్రసాద్. ఈ క్రమంలోనే ఆర్థిక పరమైన ఇబ్బందులను కూడా చవి చూసింది. దీంతో మరోసారి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చి సంచలన విషయాలు చెప్పింది.
భర్తతో విడిపోయినా ఎంజాయ్గానే
ఈ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి చెబుతూ... 'నేను డిప్రెషన్లో ఉన్న సమయంలో అతడు నా జీవితంలోకి వచ్చాడు. ఆ తర్వాత పెళ్లి.. బ్రేకప్ చకచకా జరిగిపోయాయి. విడిపోయిన తర్వాత నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు స్వేచ్చ లభించినట్లుంది. నేనే స్వతహాగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను' అంటూ చెప్పుకొచ్చింది శ్వేతా బసు ప్రసాద్.
అందుకే వ్యభిచారిణిలా మారానని
శ్వేతా బసు ప్రసాద్ తన సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ.. 'ప్రస్తుతం నేను ఇండియా లాక్డౌన్ అనే సినిమాలో నటిస్తున్నా. ఇందులో వ్యభిచారిణి పాత్రను పోషిస్తున్నా. యాక్టర్గా రాణించాలంటే ఇలాంటి క్లిష్టమైన పాత్రలనే చేయాలి. అందుకే దీనిలో ఒదిగిపోవాలనే ఉద్దేశ్యంతో రెడ్ లైట్ ఏరియాలోకి కూడా వెళ్లొచ్చా. వాళ్ల కష్టాలను దగ్గరుండి మరీ చూశాను' అని వివరించిందామె.