Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
నా తోటలో పండిన పళ్లు ఇవి.. వాళ్లు నా బాడీలో అవే చూస్తున్నారు: శ్రీరెడ్డి వీడియో వైరల్
సినిమాల్లో హీరోయిన్గా చేసినా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది తెలుగు హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. కానీ, వివాదాస్పద తీరుతో మాత్రం దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతేకాదు, తరచూ గొడవల్లో ఉంటూ హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈ భామ.. ఎంతో మందిని టార్గెట్ చేసి పోస్టులు పెట్టింది. అదే సమయంలో తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదిలి రచ్చ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోను షేర్ చేసిందామె. అందులో తన తోటలో పండిన పళ్లను చూపించడంతో పాటు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!
శ్రీరెడ్డి అంటేనే సంచలనం అనేట్టుగా
తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ చెప్పి బాంబ్ పేల్చింది శ్రీరెడ్డి. అంతేకాదు, దాన్ని నిర్మూలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరింది. ఆ సమయంలోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టడంతో పాటు పలువురిపై ఆరోపణలు కూడా చేసింది. అలాగే, ఫిలిం ఛాంబర్ ముందు నగ్నంగా నిరసన చేసి దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిందీ తెలుగు బ్యూటీ.
సినీ పెద్దలను టార్గెట్ చేసి పాపులర్
కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలోనే శ్రీరెడ్డి సినీ పరిశ్రమలోని బడా సెలెబ్రిటీలను టార్గెట్ చేసింది. పలానా ప్రముఖుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది. సరిగ్గా అప్పుడే ఓ వ్యక్తి తనతో డేట్ చేశాడని చెప్పింది. అంతేకాదు, కొన్ని ఫొటోలు, వీడియోలను బయట పెట్టి కలకలం రేపింది. దీంతో ఆమెకు మహిళా సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.
హీరో, హీరోయిన్లపై షాకింగ్ పోస్టులు
తరచూ ఏదో ఒక గొడవలో తలదూర్చనిదే నిద్ర పట్టదేమో అన్నట్లుగా శ్రీరెడ్డి వ్యవహార శైలి ఉండేది. అంతలా ఆమె ఇండస్ట్రీకి చెందిన ఎవరో ఒకరిపై ఆరోపణలు, విమర్శలు చేస్తుండేది. మరీ ముఖ్యంగా టాలీవుడ్లోని కొందరు హీరోయిన్లు, స్టార్ హీరోలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీటి వల్ల ఆయా స్టార్ల ఫ్యాన్స్ ఆమెపై అదే రితిలో కామెంట్స్ చేస్తున్నారు.
తన అందాలు బూతులతో రచ్చ రచ్చ
శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటోంది. ఈ క్రమంలోనే అందరిపై తనకు తోచిన విధంగా కామెంట్లు చేయడంతో పాటు అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇప్పటికే కుర్రాళ్ల గుండెళ్లో గుచ్చుకునేలా ఎన్నో ఫొటోలను వదిలిన ఈ అమ్మడు.. ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. అదే సమయంలో బూతులు కూడా మాట్లాడుతూ షాకిస్తోంది.
నా తోటలో పండిన పళ్లు ఇవి అంటూ
తాజాగా వివాదాస్పద హీరోయిన్ శ్రీరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన ఇంటి పైన ఒక తోటను ఏర్పాటు చేసినట్లు చెప్పింది. అంతేకాదు, అందులో తాను స్వయంగా పండించిన టమాట పళ్లను ఆ వీడియోలో చూపించింది. వీటితో పాటు మరికొన్ని మొక్కలను కూడా పెంచుతున్నట్లు చెప్పింది. ఈ మొత్తాన్ని సెల్ఫీ వీడియో రూపంలో చూపించింది.
వాళ్లు నా బాడీలో అవే చూస్తున్నారు
ఈ వీడియో తీస్తున్న సమయంలో తన పక్కింటి కుర్రాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ‘నేను పైకి వచ్చిన ప్రతిసారీ ఆ కుర్రాళ్లు నన్నే చూస్తుంటారు. వాళ్లు నా ముఖాన్ని మాత్రమే కాదు. బాడీలోని అన్ని పార్టులను చూస్తుంటారు. అందుకే వాళ్లు ఈ వీడియోలో కనిపించకుండా బ్లర్ చేస్తున్నాను. మీరు కూడా అవేమీ పట్టించుకోకుండా నన్నే చూడండి' అని చెప్పుకొచ్చిందామె.
Recommended Video