Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
శ్రీదేవి జయంతి సందర్భంగా సరికొత్త లుక్లో జాన్వీ కపూర్.. తిరుమలలో ఆమెతో కలిసి..
అలనాటి అందాల నటి శ్రీదేవి కూతురిగా పరిచయమైనా.. తనకంటూ ప్రత్యేక గుర్తుంపును తెచ్చుకుంది జాన్వీ కపూర్. తల్లి బతికున్నప్పుడే తన వ్యవహార శైలితో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోనంతగా ఉండే ఈ అమ్మడు.. తొలి సినిమాలోనే నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ ఊపులోనే మరికొన్నిసినిమాలకూ సంతకాలు చేసేసింది. ఇప్పుడు ఆ సినిమా షూటింగులో పాల్గొంటోంది.
మంగళవారం శ్రీదేవి 56వ జయంతి. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమల వచ్చింది. ఆమె, తన స్నేహితురాలితో కలిసి శ్రీవారి మెట్ల మార్గంలో ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జాన్మీ కపూర్కు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె తల్లి, అలనాటి అందాల నటి శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపింది.
తిరుమలకు జాన్వీ కపూర్ లంగావోణీ వేసుకుని వచ్చింది. అక్కడ దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోలను ఉంచి, 'హ్యాపీ బర్త్డే మమ్మా, ఐ లవ్ యు' అని క్యాప్షన్ పెట్టింది. ఎప్పుడూ చూడని విధంగా ఇందులో సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం జాన్వీ కపూర్ 'రూహీ అఫ్జా' అనే సినిమా చేస్తోంది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అలాగే, 'దోస్తానా 2' సినిమాలోనూ చేస్తోంది.