Don't Miss!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
స్వయంతృప్తి పొందే మహిళగా శృతి హాసన్.. ఆ బోల్డ్ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
వెబ్ సిరీస్ స్టోరీలకు ఈ మధ్య కాలంలో భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. ఓటీటీ కంపెనీలు లాభాల్లోకి వెళ్లడానికి ముఖ్యంగా బోల్డ్ కథలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. స్టార్ హీరోయిన్స్ కూడా బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఏ మాత్రం నో చెప్పడం లేదు. పాత్ర నచ్చితే కొందరు రెమ్యునరేషన్ ని కూడా పట్టించుకోవడం లేదట. అసలు మ్యాటర్ లోకి వస్తే త్వరలోనే శృతి హసన్ చేయబోయే ఒక పాత్ర మాత్రం సౌత్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చెయ్యడం కాయమని తెలుస్తోంది.
కెరీర్ మొదట్లోనే బికినీలో..
కెరీర్ మొదట్లోనే బికినీలో కనిపించి ఓ వర్గం అభిమానులకు షాక్ ఇచ్చిన శృతి హాసన్ గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది. విమర్శలు రాకుండా ఉండేందుకు ఎక్కువగా కేర్ తీసుకుంది. దాదాపు సౌత్ ఇండస్ట్రీలో సగం మంది స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఓటీటీ ప్రపంచం వైపు యూ టర్న్ తీసుకుంది.
వెబ్ సిరీస్ లో బోల్డ్ క్యారెక్టర్
ఇక చాలా రోజుకు తరువాత శృతి హాసన్ మునుపెన్నడు చేయని ఒక బోల్డ్ పాత్రలో కనిపించబోతోంది. లస్ట్ స్టోరీస్ ని తెలుగులో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఒరిజినల్ కథలో కీయరా అద్వానీ చేసిన పాత్ర ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ కోలీవుడ్ బ్యూటీ అదే పాత్రలో సరికొత్తగా కనిపించబోతోంది.
ఆ బోల్డ్ సీన్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే
శృంగర కోరికలతో సతమతమయ్యే ఒక సాధారణ గృహిని స్వయంతృప్తి కోసం ఆరాటపడే విధానం ఆ వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ గా చూపించారు. ఇక శృతి హాసన్ కూడా కీయరా అద్వానీకి టైమింగ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా కెమెరా ముందు రచ్చ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ బోల్డ్ సీన్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందేనట. రీసెంట్ గా అందుకు సంబంధించిన సీన్స్ ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. లస్ట్ స్టోరీస్ లో శృతి హాసన్ తో పాటు తెలుగమ్మాయి ఈషా రెబ్బ నటిస్తున్న విషయం తెలిసిందే.
లస్ట్ స్టోరీస్ లో కొన్ని మార్పులు..
నలుగురు టాలీవుడ్ దర్శకులు ఈ వెబ్ సిరిస్ కోసం వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, నందిని రెడ్డి వారి పనులను పూర్తి చేయగా మరికొన్ని ఎపిసోడ్స్ కి మహనటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వెబ్ సిరిస్ లో బోల్డ్ సీన్స్ తో పాటు మంచి స్క్రీన్ ప్లే ఉంటుందని సమాచారం. ఒరిజినల్ కథలా కాకుండా మేకింగ్ లో దర్శకులు కొన్ని మార్పులు చేసినట్లు టాక్ వస్తోంది. మరి తెలుగు లస్ట్ స్టోరీస్ ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.