Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పెళ్లి తర్వాత అలా మారిన సుమంత్ అశ్విన్: ‘7 డేస్.. 6 నైట్స్’ అంటూ ఊహించని విధంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కొందరు మాత్రం ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ ఒకడు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. ఎన్నో చిత్రాల్లో నటించాడు. కానీ, పెద్దగా విజయాలను అందుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యంగ్ హీరో ఇప్పుడు '7 డేస్.. 6 నైట్స్' సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడు.
డిజైనర్ వేర్లో దేవతలా కనిపిస్తోన్న అంజనా రంగన్
ఎమ్మెస్ రాజు గత ఏడాది 'డర్టీ హరి' అనే సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఓటీటీలో ఊహించని రీతిలో క్లిక్కులను సొంతం చేసుకుందీ మూవీ. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుని సత్తా చాటింది. ఇలాంటి సినిమా తర్వాత రాజు '7 డేస్.. 6 నైట్స్' అనే ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంతో సుమంత్ అశ్విన్ నిర్మాతగా మారబోతున్నాడు. ఇందుకోసం అతడు వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభిస్తున్నాడని తెలిసింది.
'తూనీగ తూనీగ' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన సుమంత్ అశ్విన్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించాడు. అందులో 'అంతకు ముందు ఆ తర్వాత', 'కేరింత' మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందుకున్నాయి. ఈ క్రమంలోనే అతడు ఆ మధ్య ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక, ఇప్పుడు నిర్మాతగా మారుతున్నాడు. ఇదిలా ఉండగా.. సుమంత్ అశ్విన్ ప్రస్తుతం 'ఇదే మా కథ' (రైడర్స్ స్టోరి) అనే సినిమాలో నటిస్తున్నాడు. గురు పవన్ తెరకెక్కిస్తోన్న సినిమాలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కూడా నటిస్తున్నాడు. వీళ్ళకు జోడీగా భూమిక, తాన్యా హోప్ చేస్తున్నారు. పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.