కంగనను తిట్టిన ఎంపీకి సుమోటో... డిమాండ్ చేస్తున్న జాతీయ మిహిళా కమిషన్
నెపోటజం పై డిబేట్ మొదలుకుని ముంబై రాజకీయాల వరకూ అన్నింటా దూసుకుపోతున్న కంగన ఎక్కడా వెనకడుగు వేయని స్వభావంతో ప్రత్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు అన్ని వైపుల నుంచీ మద్దతు కూడగట్టుకుంటోన్న ఈ ఝాన్సీ రాణీ నేతపై సమరభేరి పూరించేందుకు సిద్ధమవుతోంది.
తన కార్యాలయంపై జరిగిన బీఎంసీ దాడిపై స్పందిస్తూ ఇక్కడి నుంచే ఇదే విధంగా పనిచేస్తానని స్పష్టం చేసి, తాను అంత తేలిగ్గా భయపడే రకం కాదని నిరూపించింది. ఇప్పుడు ఆమెకు జాతీయ మహిళా కమిషన్ మద్దతు కూడా తోడైంది. కమిషన్ నాయకురాలు రేఖా శర్మ కంగనను దుర్భాషలాడిన సంజయ్ రౌత్ పై సుమోటో యాక్షన్ తీసుకోవాల్సిందిగా ముంబై పోలీసులను డిమాండ్ చేశారు.

ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పేర్కొందంటూ కంగనపై నిప్పులు చెరిగి ఎంపీ సంజయ్ రౌత్, ఆమెను హారామ్ ఖోర్ అంటూ అభ్యంతరపూర్వ పదజాలం ఉపయోగించి మీడియా ముఖంగా దూషించారు.
ఇక ఒకానొక వీడియోలో కంగన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ధాక్రేని ఉద్దేశించి అభ్యంతరపూర్వక పదజాలం ఉపయోగించారని కేసు నమోదు చేయగా, దీనిపై స్పందిస్తూ మహిళా కమిషన్ నాయకురాలు, ముంబై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసే ముందుకు సంజయ్ రౌత్ పైనా సుమోటోగా కేసు నమోదు చేయాలని సూచించారు.


Click it and Unblock the Notifications











