Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సుశాంత్ సూసైడ్.. వెలుగులోకి వస్తున్న మాజీ ప్రియురాలి సంగతులు.. ఏం జరిగిందంటే
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత ఆయన మాజీ ప్రియురాలు అంకిత లోఖండేపై అనేక విమర్శలు తలెత్తాయి. ఆమెతో బ్రేకప్ వల్లే సుశాంత్ డిప్రెషన్లోకి వెళ్లడానికి ఓ కారణమైందనే విషయం చర్చనీయాంశమైంది. అయితే సుశాంత్తో బ్రేకప్ తర్వాత కూడా తన మాజీ ప్రియుడు సంతోషంగా ఉండాలని అంకితా లోఖండే కోరుకొందనే వార్తలు వచ్చాయి. స్వయంగా ఆమె తన ట్వీట్లో కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలో అంకిత గురించి చాలా వ్యక్తిగత విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవేమిటంటే..
Recommended Video
సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్
సుశాంత్ సింగ్ మరణం తర్వాత అంకిత లోఖండేను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారట. దాంతో ఆమె కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. తాజాగా అంకిత లోఖండే ప్రస్తుత బాయ్ఫ్రెండ్ను కూడా నెటిజన్లు తీవ్రంగా దూషించడంతో ఆయన సోషల్ మీడియా అకౌంట్లను డీ యాక్టివేట్ చేసిన విషయం తెలిసిందే.
తీవ్రమైన డిప్రెషన్లో
అంకిత లోఖండే సోషల్ మీడియాలో జూన్ 13వ తేదీ వరకు యాక్టివ్గా కనిపించారు. బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ సూసైడ్ చేసుకొన్న తర్వాత ఆమె సోషల్ మీడియాలో కనిపించడం మానేశారు. ప్రస్తుతం ఆమె ఓ రకమైన డిప్రెషన్లో ఉన్నట్టు స్నేహితులు చెబుతున్నారు. కొందరు తనను పలకరించడానికి ప్రయత్నిస్తే.. కొద్ది రోజుల వరకు నాతో ఎవరూ మాట్లాడే ప్రయత్నం చేయకండి అని కోరినట్టు సమాచారం.
అంకిత అసలు పేరు బయటకు
అంకిత లోఖండే అసలు పేరు ఇప్పుడు మీడియాలో ప్రచారం అవుతున్నది. పవిత్ర రిస్తా టెలివిజన్ సీరియల్ సెట్లో ప్రేమలో పడిన తర్వాత సుశాంత్తో ఆరేళ్లు డేటింగ్ చేశారు. అయితే పవిత్ర రిస్తా సీరియల్ నటించడానికి ముందు అంకిత అసలు పేరు తనూజ. అయితే తన ముద్దు పేరు అంకితను స్క్రీన్ పేరుగా పెట్టుకోవాలని సుశాంత్ సూచించినట్టు ఓ వార్త మీడియాలో ప్రచారం అవుతున్నది.
మమల్ని అంకిత కలిసింది..
సుశాంత్ మరణం తర్వాత తమ కుటుంబంతో కలిసింది కేవలం అంకిత లోఖండే మాత్రమే. ఆ విషయాన్ని సుశాంత్ తండ్రి కేకే సింగ్ స్వయంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పాట్నాకు వచ్చి తన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె మాతో కలిసి బాధను పంచుకొన్నారు అని విషయాన్ని కేకే సింగ్ పేర్కొన్నారు. అయితే అంకిత గురించి మాకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదనే విషయాన్ని ఆయన చెప్పారు.
బ్రేకప్ తర్వాత కూడా ఫ్రెండ్లీగానే
సుశాంత్, అంకిత లోఖండే మధ్య బ్రేకప్ జరిగిన తర్వాత కూడా వారిద్దరూ ఫ్రెండ్లీగానే ఉన్నారనేది సన్నిహితులు చెప్పుకొంటారు. వారిమధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఫోన్లో, సోషల్ మీడియాలో వారిద్దరూ టచ్లోనే ఉన్నారు. సుశాంత్తో అంకిత స్నేహంగానే ఉంటున్నారు అని స్నేహితులు పేర్కోనడం తెలిసిందే.