Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అతిలోక సుందరి శ్రీదేవికి అరుదైన గౌరవం.. స్విస్లో ఏం చేస్తున్నారో తెలుసా!
అతిలోక సుందరి శ్రీదేవికి మరో గౌరవం దక్కబోతోంది. అది భారత ప్రభుత్వం ఇవ్వబోతున్న బిరుదో, అవార్డో కాదు. పర్యాటకులకు స్వర్గధామమైన స్విట్జర్లాండ్ ప్రభుత్వం శ్రీదేవి విగ్రహాన్ని నిర్మించబోతోంది. దిగ్గజ దర్శకుడు యాష్ చోప్రా విగ్రహాన్ని 2016 లో స్విట్జర్లాండ్ లో నిర్మించారు. ఆయన తరువాత ఆ గౌరవం దక్కించుకోబోతోంది శ్రీదేవే కావడం విశేషం.
శ్రీదేవి నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ చాందినిని స్విస్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రికరించారు. ఆ చిత్రానికి గుర్తుగా శ్రీదేవి విగ్రహాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ దర్శకుడు యాష్ చోప్రా ఎక్కువగా తన చిత్రాలని స్విస్ లోనే తెరకెక్కించేవారు. ఆ తరువాత భారతీయ సినిమాల తాకిడి స్విస్ కు పెరిగింది.
భారతీయ పర్యాటకులని ఆకర్షించేందుకు స్విస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీదేవి ప్రమాదవశాత్తు దుబాయ్ లోని హోటల్ లో మరణించిన సంగతి తెలిసిందే.