Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఆ సినిమా చేయడానికి రెండు కారణాలు.. తాప్సీ పోస్ట్ వైరల్
బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది తాప్సీ. టాలీవుడ్లో ఉన్నంత వరకు కేవలం గ్లామర్ డాల్గానే చూసిన జనం.. బాలీవుడ్కు వెళ్లాక తనలోని ప్రతిభను చూస్తున్నారు. వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటోంది. పింక్ చిత్రంతో ఈ ప్రయాణం మొదలైంది. పింక్, బాద్లా, సాండ్ కీ ఆంఖ్, మిషన్ మంగళ్, తప్పడ్ వంటి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది.
అయితే తాను మిషన్ మంగళ్ చిత్రం చేయడానికి గల రెండు కారణాలను తాజాగా వెల్లడించింది. అక్షయ్ కుమార్, విద్యా బాలన్, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా వంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన మిషన్ మంగళ్ చిత్రంతో తాప్సీ సైతం ఓ క్యారెక్టర్ను పోషించింది. ఆ చిత్రంలో ఎందుకు నటించాల్సి వచ్చిందో తాప్పీ తాజాగా బయటకు వెల్లడించింది.
మిషన్ మంగళ్ షూటింగ్ లొకేషన్లో దిగిన నాటి ఫోటోను షేర్ చేస్తూ.. 'షూటింగ్ మొదట్లో దిగిన ఫోటో.. ఒకరితో ఒకరు పని చేయడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నామో ఇప్పటికీ గుర్తుంది. కొత్తగా సృష్టించాలని అనుకునే మనుషులతో సంతోషానికి ఇళ్లులా అనిపించే సెట్లో ప్రతీ రోజూ ఎంజాయ్ చేశాం. రెండు బలమైన, ముఖ్యమైన కారణాలతోనే ఈ చిత్రం చేసేందుకు ఒప్పుకున్నానని నాకు గుర్తుంది.ఈ కథలో పాలు పంచుకున్నాననే సంతోషం రాబోయే కాలంలో ఎప్పటికీ ఉంటుందనేది ఓ కారణమైతే.. అంత మంది గొప్ప నటులతో కలిసి పనిచేస్తే ప్రతీ మూమెంట్ను ఎంజాయ్ చేయవచ్చనేది రెండో కారణమ'ని తాప్పీ చెప్పుకొచ్చింది.