Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టాలీవుడ్లో హీరోయిన్లను అలా పాడు చేస్తున్నారు... ఇతర ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదు.. తాప్సీ
బాలీవుడ్ తారగా తాప్సీ పొన్ను ముద్ర వేసుకొన్నప్పటికీ.. టాలీవుడ్తోనే ఆమె గుర్తింపు పొందింది. ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పలు విభిన్నమైన చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం హిందీ చిత్రపరిశ్రమలో రాణిస్తున్నది. అలాగే ఆమె మనస్తత్వం ముక్కుసూటిగా ఉంటుందనేది పలు సందర్భాల్లో వ్యక్తమైంది. ఏదైనా అభిప్రాయాన్ని చెప్పాల్సి వస్తే సూటిగా చెప్పడం కనిపిస్తుంది. గతంలో రాఘవేంద్రరావుపై హాట్ కామెంట్ చేసిన తాప్సీ తాజాగా తెలుగు సినీ పరిశ్రమ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. గతంలోని తాప్సీ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్గా మారింది. ఇంటర్వ్యూ వివరాలు ఇవే..
టాలీవుడ్లో అదే గొప్పదనమని
తెలుగు సినిమా గురించి తాప్సీ మాట్లాడుతూ.. టాలీవుడ్ పరిశ్రమ నిజంగా పాడుచేస్తుందనేది నా అభిప్రాయం. తెలుగు సినిమా పరిశ్రమలో అదే గొప్పతనం. ఎందుకంటే ఇండస్ట్రీ వర్గాలు హీరోయిన్ను మహారాణిలా చూసుకొంటారు. హీరోయిన్ వ్యాన్ దిగితే చాలు ప్రతీ ఒక్కరు వినయంగా నిలుచుంటారు. మనం అక్కడి నుంచి వెళ్లే వరకు ఎవరూ కూర్చొరు. అలాంటి గౌరవాన్ని హీరోయిన్లకు ఇస్తారు అని తాప్సీ అన్నారు.
అలా గర్వంగా ఫీలవుతారు
టాలీవుడ్లో ఇచ్చే గౌరవంతో హీరోయిన్లు తాము గొప్ప అనే ఫీలింగ్కు లోనవుతారు. అందాల దేవతలమనే భ్రమలో పడిపోతారు. కొందరైతే దానిని తలకు ఎక్కించుకొని గర్వంగా ఫీల్ అవుతుంటారు. యూనిట్ ఇచ్చే రాయల్ ట్రీట్మెంట్తో మన అస్థిత్వాలను మరిచిపోయే ప్రమాదానికి లోనవుతాం అని తాప్పీ తన అనుభవాలను అభిప్రాయంగా చెప్పారు.
టాలీవుడ్ను మిస్ అవుతున్నా
బాలీవుడ్లో అలాంటి పరిస్థితి కనిపించదు. తెలుగు సినిమా పరిశ్రమలో దక్కే గౌరవాన్ని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ కలుగుతుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్లను రాణిలా చూసుకొంటారు. పరిశ్రమలో మహిళలకు ఇచ్చే గౌరవం మిగితా ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించదు. అందుకే నాకు తెలుగు సినీ పరిశ్రమ అంటే నాకు అత్యంత గౌరవం అని తాప్సీ పేర్కొన్నది.
తాప్సీ గేమ్ ఓవర్ చిత్రంలో
తాప్సీ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం గేమ్ ఓవర్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది. గతంలో ఆమె నటించిన ఆనందో బ్రహ్మ చిత్రం మంచి విజయాన్ని అందుకొన్నది. ఆమె తెలుగులో నీవెవరో అనే చిత్రంలో చివరిసారిగా కనిపించింది. 2015లో ఆమె బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.