Samantha లీడ్ హీరోయిన్గా బాలీవుడ్ మూవీ.. నిర్మాతగా మారుతున్న టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా?
అందాల భామ సమంత రుత్ ప్రభు కెరీర్ రాకెట్లా దూసుకెళ్తున్నది. బాలీవుడ్లో పాగా వేసేందుకు సమంత సిద్ధమువుతున్నది. దక్షిణాదిలో అగ్రతారగా రాణిస్తున్న ఈ బ్యూటీ ఇకపై హిందీ సినిమా పరిశ్రమపై కన్నేసినట్టు కనిపిస్తున్నది. ఆ క్రమంలోనే సమంత భారీ, క్రేజీ ప్రాజెక్టులను గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు స్పష్టమవుతున్నది. సమంత లీడ్ యాక్టర్గా హీరోయిన్ తాప్సీ పన్ను నిర్మాతగా రూపొందించిన క్రేజీ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళితే..

మలుపు తిప్పిన పుష్ప మూవీ
సమంత కెరీర్ ఊహించని విధంగా పుష్ప చిత్రంతో సరికొత్త మలుపు తిరిగింది. ఊ అంటావా ఊఊ అంటావా పాటతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకొన్నారు. అప్పటి నుంచి బాలీవుడ్ దర్శక, నిర్మాతలు సమంతకు భారీ ఆఫర్లు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

ముంబైలో మకాం.. బాలీవుడ్పై ఫోకస్
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రుత్ ప్రభు తన మకాంను ముంబైకి మార్చేసింది. బాలీవుడ్లో క్రేజీ షోలో భాగమవుతున్నారు. ఇటీవల కరణ్ జోహర్ షోలో అక్షయ్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. కాఫీ విత్ కరణ్ 7 షోలో ఆసక్తికరమైన విషయాలను పంచుకొన్నారు. అందరిని ఓ రకమైన షాక్కు గురిచేసే కరణ్కు ఏకంగా సమంతనే తికమక పెట్టింది.ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ 7 షో ట్రైలర్ వైరల్ అయింది.

కరణ్ జోహర్ మూవీలో సమంత
అయితే బాలీవుడ్లో సమంతకు ఆఫర్లు భారీగా వస్తున్నాయని, ప్రస్తుతం కరణ్ జోహర్ సినిమాలో నటిస్తున్నారనే వార్తల మధ్య మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. హీరోయిన్ తాప్సీ పన్ను నిర్మాతగా మారి రూపొందించబోయే సినిమాలో సమంత లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో తాప్సీ స్వయంగా వెల్లడించారు. సమంత లీడ్గా నటించనున్న సినిమా గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన చేస్తామని తాప్సీ చెప్పారు.

సమంత లీడ్గా తాప్సీ పన్ను నిర్మాతగా
పింక్ విల్లాకు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ సమంత నేను కలిసి పనిచేయబోతున్నాం. ఈ సినిమా గురించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నేనే నిర్మాతగా సినిమాను నిర్మించబోతున్నాను. నేను ఓ కీలక పాత్రలో కూడా కనిపిస్తాను. సమంత లీడ్ పాత్రలో నటిస్తున్నారు అని తాప్సీ అన్నారు.

సమంతతో మూవీ నిజమే అంటూ తాప్సీ
గత కొద్దికాలంగా సమంత, తాప్సీ పన్ను ఓ ప్రాజెక్టును తెరపైకి తీసుకు రాబోతున్నారు అనే వార్త ముంబై మీడియాలో వినిపిస్తున్నది. ఆ వార్తకు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అవుట్ సైడర్ అనే బ్యానర్పై ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తాప్సీ చెప్పారు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తాం. నేను నటిస్తున్న మిథాలీ రాజ్ బయోపిక్ శభాష్ మిత్తు అనే సినిమా పనిలో బిజీగా ఉన్నాను. ఆ సినిమా జూలై 15న రిలీజ్ అవుతున్నది అని తాప్సీ చెప్పారు.

సమంత రుత్ ప్రభు సినిమాలు ఇవే..
సమంత కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన శాకుంతలం, యశోదా సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి.ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ అనే చిత్రంలో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్నారు. డిసెంబర్ 23న రిలీజ్ కానున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ,మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











