అలాంటి ప్రేమ మరెక్కడా లేదట.. మిల్కీ బ్యూటీలో మరో కోణం
సాధారణంగా సెలెబ్రిటీల్లో ఎక్కువగా పెట్ లవర్స్ ఉంటారు. పెంపుడు జంతువులతో ఎంతో విలువైన సమయాన్ని గడుపుతుంటారు. దేశంలోని కొత్త కొత్త జాతుల పెంపుడు జంతువులను తెప్పించుకుని మరి పెంచుకుంటారు. అది కూడా ఓ ప్రెస్టేజ్ ఇష్యూలాంటిదే. మంచు లక్ష్మీ వద్ద ఉన్న కుక్క దేశంలోనే మరెక్కడా. ఆ జాతికి సంబంధించిన కుక్కలు ఇండియాలో ఉండవట. అలా తమ తమ రేంజ్కు తగ్టట్టుగా పెంచుకుంటారు.
లాక్ డౌన్ సమయంలో సెలెబ్రిటీలందరూ ఇలానే ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీతోనో, ప్రకృతి ఒడిలోనే, పెంపుడు జంతువులతోనో చక్కగా గడిపారు. మిల్కీ బ్యూటీ తమన్నా సైతం లాక్ డౌన్లో ఫుల్ ఎంజాయ్ చేసింది. వర్కౌట్లు చేస్తూ ఫిట్ నెస్ను మెయింటెన్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ప్రస్తుతం పాల సుందరి ప్రకృతి ఒడిలో విహరిస్తోన్నట్టు కనిపిస్తోంది.

తాజాగా తమన్నా సైతం వాటి ప్రేమల్లో పడ్డట్టు తెలుస్తోంది. పెట్స్ ప్రేమ, వాటి గొప్పదనం చెబుతూ ఓ పోస్ట్ చేసింది. ఈ మేరకు తమన్నా షేర్ చేసిన ఫోటోలను అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అందులో ఉన్న కుక్కపిల్లల గుంపును చూస్తుంటే అందరికీ తెగ ముచ్చటేస్తోంది.
పెట్స్ చూపించే ప్రేమ మరెక్కడా లభించదని చెప్పుకొచ్చింది. ఇక తమన్నా షేర్ చేసిన ఫోటోలను చూసిన కాజల్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దేవుడా... ఎంత ముద్దుగా ఉన్నాయని సంబర పడింది. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సీటీమార్ చిత్రంతో బిజీగానే ఉంది. కరోనా కారణంగా షూటింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.


Click it and Unblock the Notifications











