Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇది మంచి అవకాశం.. ఈ టైమ్ అంతా దానికే వేడేస్తా.. భలే తమన్నాలే!
ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతోంది. ఈ మహమ్మారి వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అన్నిదేశాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ జనాన్ని సామాజిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశాయి. కరోనా కట్టడికి ఏకైక, ఉత్తమమైన మార్గం సామాజిక దూరమే అంటున్నారు వైద్య నిపుణులు.
ఈ పరిస్థితుల్లో మరో 21 రోజులు (ఏప్రిల్ 15 దాకా) దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు ప్రధాని మోడీ. దేశ ప్రజలంతా కరోనా కట్టడిలో భాగమవుతూ ఇంటికే పరిమితం కావాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సాధారణ ప్రజలు మొదలుకొని సినీ సెలబ్రిటీల వరకు అందరూ ఇంట్లోనే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై తాజాగా మిల్కీ బ్యూటీ రియాక్ట్ అయింది.
కరోనా కారణంగా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేస్తుకుంటానని అంటోంది తమన్నా. ఇన్ని రోజులు చేయాలనుకొని వాయిదా వేస్తూ వచ్చిన పనులపై దృష్టి పెడుతూ ఈ 21 రోజుల్లో అవన్నీ పూర్తిచేసుకుంటానని చెబుతోంది. అంతేకాదు ''ఏదైనా అలవాటు కావాలన్నా, దాని నుండి దూరం కావాలన్నా 21 రోజులు అవసరమని అంటారు కదా. ఓ మంచి పని కోసం ఈ 21 రోజులు ఎందుకు వాడకూడదు?'' అని అంటోంది తమన్నా. ఆమె తీరు చూసి భలే తమన్నాలే! అంటున్నారు ప్రేక్షకులు.