Don't Miss!
- News
బాలకృష్ణకు `కాపు`నాడు వార్నింగ్: పెదవి విప్పని పవన్- `పొత్తు` పోతుందనే భయం..?!
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
ప్రధాని నిర్ణయం ఎంతో గొప్పది.. తమన్నా కామెంట్స్
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. రానున్న మూడు వారాల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ పాటింస్తుందని ప్రకటించారు. కరోనాను ఎదుర్కొవాలంటే ఒకే ఒక్క మార్గమని అదే.. ఇంట్లో ఉండటమని సూచించారు. పెద్ద పెద్ద దేశాలు కరోనా ధాటికి తట్టుకోలేకపోతున్నాయని, అమెరికా, ఇటలీ వంటి దేశాలను చూసి భారతదేశం మేల్కొవాల్సి ఉంటుందని ప్రజలకు వివరించారు.
ఈ క్రమంలోనే దేశం మొత్తం లాక్ డౌన్ విధించినట్టు పేర్కొన్నారు. ఇకపై ఇంటి నుంచి ప్రజలెవరూ బయటకు రావొద్దని ఈ లాక్ డౌన్ నేటి అర్ధరాత్రి నుంచే అమలవుతుందని ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తమన్నా స్పందిస్తూ ఓ పోస్ట్ చేసింది.

'మన ప్రధాని నరేంద్ర మోడీ రానున్న 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు.. కరోనాను ఎదురించేందుకు ఇదో గొప్ప నిర్ణయం.. మన జీవితాల కంటే ఏదీ గొప్పది కాదు.. నా కుటుంబం, నేను ఇంట్లోనే ఉన్నాము.. మీ అందరూ కూడా అదే చేయాలని కోరుతున్నాను. ఇంట్లోనే ఉండండి.. ప్రాణాలను కాపాడుకోండ'ని ట్వీట్ చేసింది.
Our Prime Minster @narendramodi ji has announced a 21 day nationwide lockdown. A great step to fight corona. Nothing is more important than our lives. My family and I are staying at home, requesting you to do the same 🙏🏼 #StayAtHomeSaveLives
— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 24, 2020