ఆఫర్ ఇచ్చి అలాంటి కోరిక.. డబ్బు ఇచ్చి.. కమిట్మెంట్పై యువ హీరోయిన్
సినీ పరిశ్రమలో అమ్మాయిలకు, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే ఔత్సాహిక తారలకు వేధింపులు ఉండటం సాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే శ్రీరెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వాళ్లు కొందరిపై బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పడప్పుడు కొందరు తారలు బయటపెట్టే విషయాలు పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తుంటాయి. అయితే తాజాగా ఓ వర్థమాన తార కమిట్మెంట్ గురించి మాట్లాడుతూ..
తొలుత తాను ప్రైవేట్ ఉద్యోగం చేసేదానిని. అయితే అక్కడ నాకు తక్కువగా జీతం వచ్చేది. నాకు జయ జానకి నాయక చిత్రంలో అవకాశం వచ్చింది. మూడు రోజులకే ప్రైవేట్ ఉద్యోగం చేస్తే వచ్చే మొత్తం నాకు వచ్చింది. దాంతో ఉద్యోగం మానేసి నేను సినిమా పరిశ్రమ వైపు మొగ్గు చూపాను అని ఆమె చెప్పారు.

ఆడిషన్స్ సమయంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కొంత మంది ప్రవర్తించే తీరు ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది నాకు చెప్పారు. కానీ నాకు ఎక్కువగా అలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. కొన్నిసార్లు మేనేజర్లు అలా బిహేవ్ చేస్తుంటారు. కానీ నేను వాటికి లొంగను. కావాలంటే.. నా రెమ్యునరేషన్ వారికే ఇచ్చి నేను నటించడానికే మొగ్గు చూపుతాను అని వర్థమాన తార చెప్పారు.
సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒకట్రెండు సార్లు అలాంటి వ్యక్తులు ఎదురుపడ్డారు. కానీ వారి ప్రవర్తన గమనించి.. నేను వారి బారిన పడకుండా తప్పుకొన్నాను. పరిస్థితి బాగాలేకపోతే ఆ సినిమాను వదులుకొన్నాను. అలాంటి వ్యక్తులతో శత్రుత్వం పెంచుకోకుండా నవ్వుతూనే వారిని కోరికలను తిరస్కరించే ప్రయత్నం చేశాను అని ఆమె అన్నారు.

గతంలో ఈ వర్థమాన తార ఇచ్చిన ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్గా మారింది. చాలా మంది నెటిజన్లు ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలియజేస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఎలాగు ఉంటాయి. వాటిని దాటుకొంటూ వెళితే కెరీర్ బాగుందని సలహాలు ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











