Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సొంత ఖర్చులతో అందాల రాక్షసి సమాజసేవ.. ఎంత మంచి పని చేసిందో తెలుసా?
అందాల రక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఆ సినిమా తరువాత అమ్మడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. సొట్టబుగ్గల అందంతో ఓ వర్గం కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది. ఇక ఈ బ్యూటీ చాలా కాలం తరువాత వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తడంతో సాటి జనాలకు తోచినంత సహాయాన్ని అందిస్తోంది.
ఇప్పటికే ఈ బ్యూటీ కరోనా క్రిసిస్ చారిటీకి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించగా ఇప్పుడు మరొక మంచి పనితో అందరిని ఆకర్షించింది. లావణ్య ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా రెడ్డితో కలిసి ఈ మంచి పనికి శ్రీకారం చుట్టింది. కాటన్ ద్వారా నాణ్యత కలిగిన మాస్క్లను తయారు చేసి వాటిని ఉచితంగా అందించడానికి సిద్ధమయ్యారు. అవసరమైన అనుమతి పొందిన తర్వాత వాటిని ఆరోగ్య నిపుణులకు పంపిణీ చేయనున్నారు.
లావణ్య చేస్తున్న మంచి పనికి సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ఆమెపై పాజిటివ్ గా ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు హీరోయిన్స్ లలో మొట్టమొదట ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది లావణ్య త్రిపాఠీ.
ఆమె అర్జున్ సురవరం కో స్టార్ నిఖిల్ కూడా ఇటీవల అదే తరహాలో కరోనా కోసం పోరాడుతున్న వైద్యులకు మెడికల్ కి సంబంధించిన కేరింగ్ పరికరాలను అందించిన విషయం తెలిసిందే. ఇక అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో పవన్ కళ్యాణ్ తో ఆమె ఒక సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.