ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డా.. యానిమల్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్!
Tripti Dimri: 'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ మారింది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు ఒక్కసారిగా ట్రెండింగ్ స్టార్ మారారు. దీంతో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అయితే.. తాజాగా యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన కెరియర్ స్టార్టింగ్ లో చాలా సమస్యలను ఎదుర్కున్నానని తెలిపింది, అలాగే యానిమల్ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుకు చేసుకుంది. తన వ్యక్తిగత విషయాలను వెల్లడించింది.
మొదటిసారి 'లైలా మజ్ను' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ యానిమల్ సినిమాతో తన అందంతో బోల్డ్ నెస్ తో మరొకసారి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈమె అందానికి బాలీవుడ్ ఫిదా అయింది. ఈమె అందం నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిప్తి దిమ్రీ ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. దీంతో వరుసగా పలు సినిమాలలో బోల్డ్ ఆఫర్స్ కంటిన్యూ చేస్తుంది.అలాగే..నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ షోలతో బ్లాస్ట్ చేస్తూ ఉంటుంది.

యానిమల్ బ్యూటీ .. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి, ఆ సినిమా సమయంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి గుర్తుకు చేసుకుంది. ఆ సినిమా లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసినప్పుడు తాను ఎంతగానో బాధపడ్డానని, ఆ సమయంలో రణ్ బీర్ కపూర్ కపూర్ తనకెంతో సపోర్ట్ గా నిలిచారని, కొన్ని సమయంలో తనకు ధైర్యంగా ఉన్నారని చెప్పారు.
యానిమల్ తోపాటు మరో సినిమా కోసం కూడా ఆ సమయంలో వర్క్ చేయాల్సి వచ్చిందని, దీంతో డైలీ రెండు షిఫ్ట్ లలో నటించాల్సి వచ్చేదని, ఆ సమయంలో తాను ఎంతగానో అలసిపోయానని సరిగ్గా నిద్ర ఉండలేదని పేర్కొంది. అలాగే యానిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ తో మాట్లాడే ఒక సన్నివేశాన్ని షూట్ చేసినప్పుడు తాను ఎంతగానో బాధపడ్డానని, అది చాలా పెద్ద డైలాగ్ కావడంతో పూర్తిగా మర్చిపోయానని అన్నారు.

కొన్ని సీన్లలో కన్నీళ్లు పెట్టుకోవలసి వచ్చిందని కానీ ఆ సమయంలో ఎంత ట్రై చేసినా తనకు కన్నీళ్లు రాలేదని ఆ సమయంలో తాను ఎంతో ఒత్తిడికి లోనయ్యానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తన పరిస్థితిని అర్థం చేసుకున్న రన్బీర్ కపూర్ తనకు సపోర్ట్ గా నిలిచాడని, వాళ్ల సమయాన్ని తాను వృధా చేస్తున్నాననే భావన తనకు కలిగిందని అన్నారు.


Click it and Unblock the Notifications











