Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రిషకు ఏమైంది?.. ఆ ట్వీట్ అర్థం అదేనా?
సౌత్ సూపర్ స్టార్ త్రిష రేంజ్ పూర్తిగా మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగిపోతోంది. మధ్యలో కాస్త వెనకబడినట్టు అనిపించినా.. 96 సినిమాతో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. ఆపై సూపర్ స్టార్ రజినీకాంత్ పేటా సినిమాలో నటించి.. తన చిరకాల వాంచను తీసుకుంది. అయితే టాలీవుడ్లోనూ మళ్లీ తన సత్తాచాటుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్రాజెక్ట్కు ఓకే చెప్పింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
అయితే త్రిష మాత్రం సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఈ మధ్యే టిక్ టాక్లోకి ప్రవేశించి అందర్నీ ఆకట్టుకుంటోంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని క్యూట్ క్యూట్ స్టెప్పులతో త్రిష అందర్నీ ఫిదా చేసేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ లాక్ డౌన్ను త్రిష ఈ విధంగా ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా త్రిష చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
త్రిష చేసిన ట్వీట్ ఏంటంటే.. 'ప్రస్తుతానికి నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలియకుండా ఉండటం మంచిది. మైండ్కు ఇది డిజిటల్ చికిత్స లాంటిది. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. లవ్ యూ గాయ్స్.. త్వరలోనే కలుద్దాం' అంటూ ట్వీట్ చేసింది. అయితే త్రిష ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు. చెన్నై, తమిళనాడులోని పరిస్థితిని చూడలేక ఇలా చేసిందా? లేదా? వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా? లేదా డిప్రెషన్లోకి వెళ్లారా? అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన అభిమానులు మాత్రం ఇంట్లోనే ఉండండి క్షేమంగా ఉండండని జాగ్రత్తలు చెబుతున్నారు.