Don't Miss!
- Sports వేరీజ్ `మ్యాడ్` మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
త్రిషకు ఏమైంది?.. ఆ ట్వీట్ అర్థం అదేనా?
సౌత్ సూపర్ స్టార్ త్రిష రేంజ్ పూర్తిగా మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగిపోతోంది. మధ్యలో కాస్త వెనకబడినట్టు అనిపించినా.. 96 సినిమాతో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. ఆపై సూపర్ స్టార్ రజినీకాంత్ పేటా సినిమాలో నటించి.. తన చిరకాల వాంచను తీసుకుంది. అయితే టాలీవుడ్లోనూ మళ్లీ తన సత్తాచాటుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్రాజెక్ట్కు ఓకే చెప్పింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
అయితే త్రిష మాత్రం సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఈ మధ్యే టిక్ టాక్లోకి ప్రవేశించి అందర్నీ ఆకట్టుకుంటోంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని క్యూట్ క్యూట్ స్టెప్పులతో త్రిష అందర్నీ ఫిదా చేసేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ లాక్ డౌన్ను త్రిష ఈ విధంగా ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా త్రిష చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
త్రిష చేసిన ట్వీట్ ఏంటంటే.. 'ప్రస్తుతానికి నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలియకుండా ఉండటం మంచిది. మైండ్కు ఇది డిజిటల్ చికిత్స లాంటిది. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. లవ్ యూ గాయ్స్.. త్వరలోనే కలుద్దాం' అంటూ ట్వీట్ చేసింది. అయితే త్రిష ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు. చెన్నై, తమిళనాడులోని పరిస్థితిని చూడలేక ఇలా చేసిందా? లేదా? వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా? లేదా డిప్రెషన్లోకి వెళ్లారా? అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన అభిమానులు మాత్రం ఇంట్లోనే ఉండండి క్షేమంగా ఉండండని జాగ్రత్తలు చెబుతున్నారు.