త్రిష వర్కవుట్ సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వైనం
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో టిక్ టాక్లో ప్రవేశించిన ఆమె పలు వీడియోలతో ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. ఇక టిక్ టాక్ను నిషేధించడంతో ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్లో తరచుగా కనిపిస్తున్నారు. తాజాగా ఆమె పోస్టు చేసిన సెల్ఫీ వైరల్గా మారింది.
దినచర్యలో భాగంగా వర్కవుట్ చేసిన త్రిష ఆ తర్వాత సెల్ఫీ తీసుకొన్నట్టు కనిపించింది. త్రిష తన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా ఆ సెల్ఫీ ఫోటో వైరల్ అయింది. క్లీవేజ్ షో చేస్తూ తీసుకొన్న ఫోటోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మనసులో ఎలాంటి మలినం లేని కాంతికిరణాలు.. మూడ్.. మీ కోసం అంటూ త్రిషా కామెంట్ పెట్టారు.

త్రిషా కెరీర్ విషయానికి వస్తే.. లాక్డౌన్కు ముందు ఆమె రజనీకాంత్తో కలిసి పేటా చిత్రంలో నటించారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఆమె రజనీకాంత్తో నటించడం అదే మొదటిసారి. ప్రస్తుతం త్రిషా షుగర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఆ చిత్రం విడుదల నిలిచిపోయింది. థియేటర్లు ఓపెన్ అయితే ఆ సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











