మహిళలకు దక్కిన గౌరవం.. సంతోషంలో త్రిష!
మహిళలకు అనుకూలంగా ఇటీవల సుప్రీం కోర్టు పలు సంచలనం తీర్పులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సుప్రీం కోర్టు సహజీవనం నేరం కాదని, స్వలింగ సంపర్కం చట్టబద్ధమే అంటూ పలు సంచలన తీర్పులు వెల్లడించింది. ఈ తీర్పులపై పలువురు సెలెబ్రిటీలు హర్షం వ్యక్తం చేశారు.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలని కూడా సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్టార్ హీరోయిన్ త్రిష సంతోషం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు తన తీర్పు ద్వారా మహిళలకు గౌరవం దక్కేలా చేసిందని తెలిపింది.

త్రిష నటించిన 96 చిత్రం అక్టోబర్ 4 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా త్రిష మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. 96 చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. విజయ్ సేతుపతి కూడా సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించాడు.


Click it and Unblock the Notifications











