Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరోసారి అజ్ఞాతవాసి హీరోయిన్ పై త్రివిక్రమ్ ఫోకస్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకోకుండా వెండితెరకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. కరోనా లేకపోయి ఉంటే ఈపాటికే ఎన్టీఆర్ సినిమాను కొనసాగిస్తూనే మరో సినిమాపై అప్డేట్ ఇచ్చేవాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా షూటింగ్ కి చాలా ఎక్కువగా గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో ప్రాజెక్టును ఎనౌన్స్ చేసిన త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులను ఆల్ మోస్ట్ ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది.
అరవింద సమేత తరువాత మరోసారి ఒక్కటవుతున్న కాంబినేషన్ కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. మొదట మళ్ళీ పూజా హెగ్డేనే సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు టాక్ అయితే గట్టిగా వచ్చింది గాని ఎన్టీఆర్ తో మరోసారి సేమ్ హీరోయిన్ అంటే కాస్త బోరింగ్ గా ఉంటుందని చిత్ర యూనిట్ కొత్తగా ఆలోచించినట్లు సమాచారం.
మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ని ఫిక్స్ చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదివరకే అజ్ఞాతవాసి సినిమాలో కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేసుకున్న త్రివిక్రమ్ అప్పుడు కలలో కూడా ఊహించని డిజాస్టర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అలా కాకుండా బాక్సాఫీస్ హిట్టిచ్చే కమర్షియల్ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అల.. వైకుంఠపురములో సక్సెస్ కావడంతో త్రివిక్రమ్ రేంజ్ ఇప్పుడు గట్టిగానే పెరిగింది. మరి కీర్తి సురేష్ ఆయనతో మరోసారి సినిమా చేయడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.