Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్న రంగీలా బ్యూటీ ఊర్మిళ
దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. నామినేషన్ గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. పలువురు సినీ స్టార్లు సైతం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకుంటున్నారు.
బాలీవుడ్ నటి ఊర్మిళా మండోద్కర్ ఈ వారం కాంగ్రెస్ పార్టీలో చేయబోతున్నారు. ముంబై నార్త్ నుంచి ఆమె లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ముంబై కాంగ్రెస్ మాజీ చీఫ్ సంజయ్ నిరుపమ్ను మార్చి 25న కలిశారు. త్వరలో పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోన్నట్లు తెలుస్తోంది.
మరో వైపు బిగ్ బాస్ 10 కంటెస్టెంట్, తనకు తానుగా దేవుడిగా చెప్పుకుంటూ బాబాగా చలామణి అవుతున్న స్వామి ఓం కూడా ఈ సారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. న్యూ ఢిల్లీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. హిందూ వ్యతిరేకులపై పోరాటం చేసేందుకే తాను బరిలో నిలుస్తున్నట్లు స్వామి ఓం తెలిపారు.
గతేడాది ఉత్తర ప్రదేశ్లోని రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలైన ప్రముఖనటి జయప్రదకు ఈ సారి ఆ పార్టీ రాంపూర్ టికెట్ కేటాయించకపోవడంతో బీజేపీలో చేరారు.