Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అనాథ బాలికలకు ఫుడ్ పంపిణీ చేసిన ఊర్వశి రౌటేలా
మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి ఊర్వశి రటేలా మానవత్వానికి చాటుకొన్నారు. మహిళల హక్కులు, చైతన్యం గురించి తన వాణిని వినిపిస్తున్న ఊర్వశి తాజాగా అనాథ బాలికలతో కలిసి కన్య పూజా వేడుకను జరుపుకొన్నారు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో పలువురు ఆనాథ బాలికలను ఆహ్వానించి వారికి ఆహారం పంపిణి చేశారు.
నవరాత్రి వేడుకల నేపథ్యంలో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ఊర్వశి కుటుంబంలో అనాదిగా ఈ ఆచారం వస్తుందని తెలిపారు. ఈ వేడుకలో పలు రకాల ఆహార పదార్థాలను అందించారు. ఇలాంటి ఆచారాలు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
కన్య పూజ తర్వాత ఊర్వశి రౌటేలా విధుల్లోకి వచ్చి పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు ఉన్న బాక్సులను పంచిపెట్టారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ.. ముఖానికి మాస్క్, సానిటైజర్, చేతులకు గౌవ్స్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఇక ఊర్వశి రౌటేలా కెరీర్ విషయానికి వస్తే.. గౌతమ్ గులాటి, అర్చనా పూరన్ సింగ్తో కలిసి వర్జిన్ భానుప్రియా అనే చిత్రంలో నటించారు. అలాగే తెలుగులో సంపత్ నంది రూపొందిస్తన్న బ్లాక్ రోజ్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా, గాయని నేహా కక్కర్ పెళ్లికి హాజరైన ఊర్వశి హల్చల్ చేసింది.