Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అనాథ బాలికలకు ఫుడ్ పంపిణీ చేసిన ఊర్వశి రౌటేలా
మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి ఊర్వశి రటేలా మానవత్వానికి చాటుకొన్నారు. మహిళల హక్కులు, చైతన్యం గురించి తన వాణిని వినిపిస్తున్న ఊర్వశి తాజాగా అనాథ బాలికలతో కలిసి కన్య పూజా వేడుకను జరుపుకొన్నారు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో పలువురు ఆనాథ బాలికలను ఆహ్వానించి వారికి ఆహారం పంపిణి చేశారు.
నవరాత్రి వేడుకల నేపథ్యంలో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ఊర్వశి కుటుంబంలో అనాదిగా ఈ ఆచారం వస్తుందని తెలిపారు. ఈ వేడుకలో పలు రకాల ఆహార పదార్థాలను అందించారు. ఇలాంటి ఆచారాలు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
కన్య పూజ తర్వాత ఊర్వశి రౌటేలా విధుల్లోకి వచ్చి పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు ఉన్న బాక్సులను పంచిపెట్టారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ.. ముఖానికి మాస్క్, సానిటైజర్, చేతులకు గౌవ్స్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఇక ఊర్వశి రౌటేలా కెరీర్ విషయానికి వస్తే.. గౌతమ్ గులాటి, అర్చనా పూరన్ సింగ్తో కలిసి వర్జిన్ భానుప్రియా అనే చిత్రంలో నటించారు. అలాగే తెలుగులో సంపత్ నంది రూపొందిస్తన్న బ్లాక్ రోజ్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా, గాయని నేహా కక్కర్ పెళ్లికి హాజరైన ఊర్వశి హల్చల్ చేసింది.