24 క్యారెట్ల గోల్డ్ ఐఫోన్ పొగొట్టుకొన్న స్టార్ హీరోయిన్.. భారీ బహుమతి ప్రకటించిన ఐటెమ్ గర్ల్!
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అహ్మాదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా హీరోయిన్ ఊర్వశి రౌటేలాకు చేదు సంఘటన ఎదురైంది. పాకిస్థాన్పై ఇండియా అధిక్యం ప్రదర్శించే సమయంలో జోష్తో ఉన్న ఆమె తన ఖరీదైన ఐఫోన్ను పొగొట్టుకొన్నది.
వేలాది మధ్య మ్యాచ్ చూస్తూ తన ఫోన్ చేజారిన విషయాన్ని పట్టించులేదు. ఆ తర్వాత మ్యాచ్ మజా నుంచి బయటకు వచ్చిన ఆమె తీరా చూసుకొంటే ఐఫోన్ కనిపించకపోవడంతో కంగారు పడిపోయింది. దాంతో తన ఐఫోన్ పోయింది. ఎవరికైనా దొరికితే ఇవ్వాలని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసింది. దాంతో ఎలాంటి స్పందన రాకపోవడంతో తన ఫోన్ తెచ్చి ఇచ్చిన వారికి భారీ నజరానా ఇస్తానని ఊర్వశీ రౌటేలా చెప్పింది.

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా 24 క్యారెట్ల బంగారంతో చేసిన ఐఫోన్ను ఊర్వశీ రటౌలా పొగొట్టుకొన్నది. తన ఫోన్లో విలువైన సమాచారం ఉంది. కాబట్టి తనకు తెచ్చి ఇవ్వాలని వినమ్రంగా సోషల్ మీడియాలో వేడుకొన్నది.
నేను 24 క్యారెట్ల రియల్ గోల్డ్ ఐఫోన్ నరేంద్ర మోడీ స్టేడియంలో పొగొట్టుకొన్నాను. ఎవరికైనా దొరికితే దయచేసి తెచ్చి ఇవ్వండి. వీలైనంత త్వరగా నాతో కాంటాక్ట్ అవ్వండి అని తెలిపింది. అలాగే తాను ఆహ్మాదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కంప్లయిట్ పత్రాన్ని కూడా ఊర్వశి రౌటేలా షేర్ చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది.

ఖరీదైన ఐఫోన్ ఎక్కడ పొగొట్టుకొన్నదనే వివరాలు తెలియజేస్తూ లొకేషన్ను షేర్ చేసింది. ఆహ్మాదాబాద్లోని ఆ ప్రదేశాన్ని సూచిస్తూ గూగుల్ మ్యాప్ను తన సోషల్ మీడియాలో పెట్టింది. ఎవరికైనా లభిస్తే.. నాకు తిరిగి ఇవ్వండి. వారికి తగిన బహుమతిని ఇస్తాను అని ఊర్వశి రౌటేలా తెలిపింది. తన ఫోన్ చాలా ఖరీదైనది. ప్లీజ్ ఎవరికైనా దొరికితే వెంటనే తెచ్చి ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో పదే పదే కోరుతున్నది.


Click it and Unblock the Notifications











