Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జయలలిత బయోపిక్ నుంచి విద్యాబాలన్ తప్పుకోవడానికి కారణం ఇదే!
క్రేజీ హీరోయిన్ విద్యాబాలన్ ప్రస్తుతం బయోపిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. మహిళా ప్రముఖుల బయోపిక్ చిత్రాల కోసం దర్శక నిర్మాతలు విద్యాబాలన్ ని ఎంపిక చేసుకుంటున్నారు. 2011లో వచ్చిన డర్టీ పిక్చర్ చిత్రం కూడా సిల్క్ స్మిత జీవితానికి సంబంధించినదే. ఈ ఏడాది బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బసవతారకం పాత్రలో నటించింది. ఆ తర్వాత విద్యాబాలన్ పురుచ్చి తలైవి జయలలిత బయోపిక్ లో నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి.
కానీ విద్యాబాలన్ జయలలిత బయోపిక్ నుంచి తప్పుకుంది. ఏఎల్ విజయ్ తలైవి పేరుతో జయ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ముందుగా విద్యాబాలన్ నే అనుకున్నారట. కానీ విద్యాబాలన్ ఇందిరా గాంధీ పాత్రలో ఓ వెబ్ సిరీస్ లో నటించాల్సి ఉండడంతో తలైవి చిత్రాన్ని పక్కన పెట్టింది. తలైవి చిత్రానికి ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ ని ఎంపిక చేసుకున్నారు.
సాగరిక ఘోష్ రచించిన 'ఇందిరా : ది మోస్ట్ పవర్ ఫుల్ ప్రైమ్ మినిస్టర్' అనే పుస్తకం ఆధారంగా రోన్ని స్క్రూవాలా వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. అలాంటి ఇందిరా పాత్రలో విద్యాబాలన్ నటిస్తునడం ఆసక్తి నెలకొని ఉంది.