Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జయలలిత బయోపిక్ నుంచి విద్యాబాలన్ తప్పుకోవడానికి కారణం ఇదే!
క్రేజీ హీరోయిన్ విద్యాబాలన్ ప్రస్తుతం బయోపిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. మహిళా ప్రముఖుల బయోపిక్ చిత్రాల కోసం దర్శక నిర్మాతలు విద్యాబాలన్ ని ఎంపిక చేసుకుంటున్నారు. 2011లో వచ్చిన డర్టీ పిక్చర్ చిత్రం కూడా సిల్క్ స్మిత జీవితానికి సంబంధించినదే. ఈ ఏడాది బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బసవతారకం పాత్రలో నటించింది. ఆ తర్వాత విద్యాబాలన్ పురుచ్చి తలైవి జయలలిత బయోపిక్ లో నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి.
కానీ విద్యాబాలన్ జయలలిత బయోపిక్ నుంచి తప్పుకుంది. ఏఎల్ విజయ్ తలైవి పేరుతో జయ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ముందుగా విద్యాబాలన్ నే అనుకున్నారట. కానీ విద్యాబాలన్ ఇందిరా గాంధీ పాత్రలో ఓ వెబ్ సిరీస్ లో నటించాల్సి ఉండడంతో తలైవి చిత్రాన్ని పక్కన పెట్టింది. తలైవి చిత్రానికి ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ ని ఎంపిక చేసుకున్నారు.
సాగరిక ఘోష్ రచించిన 'ఇందిరా : ది మోస్ట్ పవర్ ఫుల్ ప్రైమ్ మినిస్టర్' అనే పుస్తకం ఆధారంగా రోన్ని స్క్రూవాలా వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. అలాంటి ఇందిరా పాత్రలో విద్యాబాలన్ నటిస్తునడం ఆసక్తి నెలకొని ఉంది.