Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విద్యాబాలన్ కెవ్వుకేక.. వెండితెరపై ఎమోషనల్ బయోపిక్.. ఫస్ట్ లుక్ విడుదల
మిషన్ మంగళ్ సక్సెస్ను ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే విద్యా బాలన్ వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం గణితశాస్త్ర మేధావి, హ్యాుమన్ కంప్యూటర్ శకుంతలా దేవి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. గతంలో ఓ సందర్భంగా మాట్లాడుతూ.. శకుంతలాదేవిపై ప్రశంసలు కురిపించారు. ఆమె గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న మహిళ, ప్రతిభావంతురాలు అని చెప్పారు.
దర్శకుడు అను మీనన్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శకుంతలా దేవి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అలాంటి గొప్ప మహిళ జీవితం ఆధారంగా సినిమాలో నటించే అవకాశం రావడం గర్వంగా ఉంది. ఆమె అత్యంత ప్రతిభావంతురాలైన మహిళ అని విద్యా బాలన్ అన్నారు.
శకుంతలాదేవి బయోపిక్ కోసం యూనిట్ మొత్తం చాలా గొప్పగా పనిచేసింది. టీమ్ విజన్ చాలా గొప్పగా ఉండేది. వెండితెర మీద ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ప్రతీ ఒక్కరి గుండెను ఆమె జీవితం తడుతుంది. స్ఫూర్తిగా నిలుస్తుంది అని విద్యా బాలన్ అన్నారు.
అత్యంత ప్రతిభావంతురాలైన శకుంతలాదేవి తన టాలెంట్తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కింది. చాలా చురుకుగా లెక్కలు చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే.