Don't Miss!
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- News amit shahకు సొంత కారు లేదట.. అవాక్కయ్యేలా అమిత్ షా ఆస్తులు, అప్పులు!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
గర్భం దాల్చిన అమీ జాక్సన్, బీచ్ ఒడ్డున టెమ్ట్ చేస్తూ.. వీడియో వైరల్
హీరోయిన్ అమీ జాక్సన్ తాను గర్భం దాల్చినట్లు కొన్ని రోజుల క్రితం అఫీషియల్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా పెళ్లి చేసుకోని ఈ బ్రిటన్ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ జార్జ్ పనాయిటూ ద్వారా త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది.
గర్భం దాల్చిన విషయం ప్రకటించిన అనంతరం అమీ జాక్సన్ తన బేబీ బంప్ ప్రదర్శిస్తూ కొన్ని బికినీ ఫోటోలు కూడా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె బీచ్ ఒడ్డున తన బేబీ బంప్ ప్రదర్శిస్తూ వదిలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అభిమానులను టెమ్ట్ చేస్తున్న వీడియో
బేబీ బంప్ ప్రదర్శిస్తూ అమీ జాక్సన్ రిలీజ్ చేసిన వీడియో నెటిజన్లను టెమ్ట్ చేస్తోంది. స్లోమోషన్లో అమీజాక్సన్ విసిరిన మత్తెక్కే చూపులు కుర్రకారకును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
రజనీకాంత్ మూవీ షూటింగ్ పూర్తవ్వగానే ప్రియుడి కోసం..
2.0 మూవీ షూటింగ్ అయిన తర్వాత బ్రిటన్ వెళ్లిపోయిన అమీ జాక్సన్ తన మల్టీ మిలియనీర్ బాయ్ ఫ్రెండ్ జార్జ్ పనాయిటూతో ప్రేమలో మునిగిపోయింది. కొన్ని నెలల క్రితమే ఆమె తన ప్రియుడితో రిలేషన్షిప్లో ఉన్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటన చేసిన కొన్ని వారాల తర్వాత తాను గర్భం దాల్చినట్లు వెల్లడించి అందరూ షాకయ్యేలా చేసింది.
అనుకోకుండా అలా జరిగిపోయింది
యూకె బేస్డ్ మేగజైన్ ఇంటర్వ్యూలో అమీర జాక్సన్ మాట్లాడుతూ... తాను గర్భందాలుస్తానని అనుకోలేదని, అనుకోకుండా అలా జరిగిపోయింది. అయినప్పటికీ మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఇది మా బంధాన్ని మరింత బలంగా చేసిందని అమీ జాక్సన్ వెల్లడించారు.
త్వరలో ఎంగేజ్మెంట్
మే 5వ తేదీన అమీ జాక్సన్, జార్జ్ పనాయిటూ వివాహం జరుగబోతోంది. బిడ్డ పుట్టిన తర్వాత వీరు వివాహం చేసుకునే అవకాశం ఉంది. అంటే 2020లో వివాహం ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. అమీ జాక్సన్ ఎంగేజ్మెంటుకు సంబంధించి ఇప్పటికే ముంబైలోని కొందరు సినీ సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందాయట.
అమీ జాక్సన్
2010లో ‘మద్రాసి పట్టణం' అనే తమిళ సినిమా ద్వారా ఇండియన్ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అమీ జాక్సన్.. పలు తమిళం, హిందీ, తెలుగు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రాలు ‘ఐ' మూవీతో పాటు గతేడాది విడుదలైన ఇండియన్ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ 2.0లో నటించింది.