Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అమీర్ ఖాన్ బాటలో కల్యాణ్ రామ్ హీరోయిన్... గుడ్బై అంటూ షాక్
బాలీవుడ్, టాలీవుడ్ వెండితెరపైకి దూసుకొస్తున్న యువ హీరోయిన్ వరీనా హుస్సేన్. ఇటీవల కాలంలో సినిమా రంగంలో తనదైన శైలిలో హల్చల్ చేస్తున్నది. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్లో లవ్యాత్రీ చిత్రం ద్వారా 2018లో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన దంబంగ్ 3 చిత్రంలో స్పెషల్ సాంగ్తో సందడి చేసింది.
ఇక అంతటితో ఆగకుండా టాలీవుడ్లోకి కూడా ప్రవేశించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కే సినిమాలో వరీనా హుస్సేన్ నటించే అవకాశాన్ని ఈ సుందరి చేజిక్కించుకొన్నది.
అంతేకాకుండా వరీనా హుస్సేన్కరు ఇన్స్టాగ్రామ్లో మంచి పాపులారిటీ ఉంది. ఇన్స్టాగ్రామ్లో సుమారు 2 మిలియన్లు అంటే 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే కారణం ఏమిటో గానీ.. ఉన్నట్టుండీ వరీనా హుస్సేన్ సంచలన ప్రకటన చేసింది.
తాను సోషల్ మీడియా ప్రపంచం నుంచి కొన్నాళ్లు తప్పుకోవాలని అనుకొంటున్నాను. ఇక నుంచి నేను సోషల్ మీడియాలో కనిపించను అంటూ ప్రకటన రిలీజ్ చేశారు. ఇటీవల మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా సోషల్ మీడియా నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో వరీనా హుస్సేన్ కూడా చేరారు.
ఇక వరీనా తాజా సినిమాల విషయానికి వస్తే.. గత వారం రిలీజైన 99 సాంగ్స్ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చేరువైంది. ఈ చిత్రాన్ని సంగీత మాత్రికుడు ఏఆర్ రెహ్మాన్ నిర్మాతగా, రచయితగా మారి తెరకెక్కించిన విషయం తెలిసిందే.