Don't Miss!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- News ఆపరేషన్ పిఠాపురం ! పవన్ ను ఓటమికి జగన్ బిగ్ ప్లాన్ ఇదే..!
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Technology వన్ప్లస్ 12R స్పెషన్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. బ్యాంకు ఆఫర్ల ద్వారా ధర తగ్గింపు..!
- Lifestyle Chapathi Kurma: చిటికెలో రుచికరంగా చపాతీ కుర్మా రిసిపి రెడీ.
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
యాత్ర దర్శకుడితో తమన్నా.. మరో రీమేక్ చిత్రం!
మిల్కీ బ్యూటీ తమన్నాకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందం, అభినయంతో తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటీవల వెంకటేష్ సరసన ఎఫ్2 చిత్రంలో నటించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా కొనసాగుతూనే అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తోంది తమన్నా. ప్రస్తుతం తమన్నా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. హిందీలో ఘనవిజయం సాధించిన క్వీన్ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మిలో తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తమన్నా మరో రీమేక్ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ బయోపిక్ యాత్రతో గుర్తింపు పొందిన మహి వి రాఘవ్ గతంలో ఆనందో బ్రహ్మ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ చిత్రాన్ని మహి వి రాఘవ్ తమిళంలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. తాప్సి నటించిన పాత్రలో తమన్నా నటించబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తమన్నా ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి, అభినేత్రి 2 లాంటి చిత్రాల్లో నటిస్తోంది. సుందర్ సి దర్శత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో తమన్నా నటిస్తోంది. బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు కూడా తమన్నా ప్రయత్నాలు చేస్తోంది.