Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
యాత్ర దర్శకుడితో తమన్నా.. మరో రీమేక్ చిత్రం!
మిల్కీ బ్యూటీ తమన్నాకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందం, అభినయంతో తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటీవల వెంకటేష్ సరసన ఎఫ్2 చిత్రంలో నటించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా కొనసాగుతూనే అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తోంది తమన్నా. ప్రస్తుతం తమన్నా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. హిందీలో ఘనవిజయం సాధించిన క్వీన్ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మిలో తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తమన్నా మరో రీమేక్ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ బయోపిక్ యాత్రతో గుర్తింపు పొందిన మహి వి రాఘవ్ గతంలో ఆనందో బ్రహ్మ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ చిత్రాన్ని మహి వి రాఘవ్ తమిళంలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. తాప్సి నటించిన పాత్రలో తమన్నా నటించబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తమన్నా ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి, అభినేత్రి 2 లాంటి చిత్రాల్లో నటిస్తోంది. సుందర్ సి దర్శత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో తమన్నా నటిస్తోంది. బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు కూడా తమన్నా ప్రయత్నాలు చేస్తోంది.