కోటు విప్పేసి లోదుస్తులు లేకుండా రాశీ ఖన్నా.. గ్లామర్ షోలో ఇది వేరే లెవెల్
టాలీవుడ్లో చాలా మంది ముద్దుగుమ్మలు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపిస్తున్నారు. అందులో కొందరైతే వేరే భాషల్లోనూ సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో బబ్లీ లేడీ రాశీ ఖన్నా ఒకరు.
సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో హడావిడి చేస్తోన్న ఈ అమ్మడు.. ఈ మధ్య కాలంలో బాలీవుడ్లోనూ ప్రభావాన్ని చూపిస్తోంది. మొత్తానికి చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ రాశీ ఖన్నా రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి!

అలా వచ్చి.. అన్నింట్లోనూ
రాశీ ఖన్నా టీనేజ్లోనే 'మద్రాస్ కేఫ్' అనే బాలీవుడ్ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే 'విలన్' అనే మూవీతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో తమిళంలోకి కూడా ఎంటరైంది. అలాగే, బాలీవుడ్లోనూ రాశీ ఖన్నా ఆఫర్లు అందుకుని నేషనల్ స్టార్గా మారిపోయింది.

తెలుగులో కాస్త దూరంగా
కొంత కాలంగా వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న రాశీ ఖన్నా.. ఆ మధ్య తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలు చేసింది. కానీ, ఈ రెండూ డిజాస్టర్గా మిగలడంతో ఆమెకు భారీ షాక్లు తగిలాయి. అయినా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్', మలయాళంలో 'బ్రహ్మమ్' మూవీలు చేసింది.
బాలీవుడ్లోనే ఫుల్ బిజీ
ఈ మధ్య కాలంలో రాశీ ఖన్నా బాలీవుడ్లో తెగ సందడి చేస్తోంది. ఇప్పటికే ఆమె 'రుద్ర', 'ఫర్జీ' వంటి వెబ్ సిరీస్లతో పాటు 'యోధా' అనే మూవీలోనూ నటించింది. ఇప్పుడు కూడా అక్కడ పలు మూవీల్లో నటిస్తోంది. అలాగే, తమిళంలో 'అరన్మనై 4', 'మేథావి' అనే చిత్రాలను చేస్తోంది. వీటితో పాటు తెలుగులో 'తెలుసు కదా' అనే సినిమాలో భాగం అయింది.

అక్కడ యమా యాక్టివ్
రిజల్ట్తో అసలు సంబంధమే లేకుండా రాశీ ఖన్నా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఫ్యాన్స్ను యమ అలరిస్తోంది.

గ్లామర్ డోస్ పెంచింది
సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా.. క్రమం తప్పుకుండా గ్లామర్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్తో పాటు ఎన్నో హాట్ ఫొటోలను కూడా పంచుకుంటోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతూనే ఉంటోంది. ఫలితంగా తన క్రేజ్ను మరింతగా పెంచుకుంటోంది.

రాశీ హాట్ పిక్స్ వైరల్
బబ్లీ హీరోయిన్ రాశీ ఖన్నా తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె లోదుస్తులు లేకుండానే దర్శనమిచ్చింది. పైగా వేసుకున్న కోటు బటన్స్ కూడా తీసేసి రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా రాశీ ఖన్నా షేర్ చేసిన ఈ ఫొటోలు అన్నీ ఓ రేంజ్లో వైరల్గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











