Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జేమ్స్ బాండ్ 25వ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఖరారు!
ప్రపంచ ప్రేక్షకులంతా ఎదురు చూసే మోస్ట్ పాపులర్ మూవీ సిరీస్ జేమ్స్ బాండ్. ఇప్పటి వరకు 24 సినిమాలు రాగా... 25వ సినిమా మొదలైనప్పటి నుండి అనేక వివాదాల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. చివరకు ఇంతకు ముందు దర్శకుడిగా ఎంపికైన డానీ బోయెల్ తప్పుకోవడంతో... అతడి స్థానంలో కారీ జోజి ఫుకునాగా అనే కొత్త దర్శకుడిని ఎంపిక చేశారు. ఈ మేరకు జేమ్స్ బాండ్ సినిమాల నిర్మాణ సంస్థలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
దర్శకుడు ఫైనల్ కావడంతో షూటింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు. మార్చి 4, 2019 నుండి లండన్లోని పీనివుడ్ స్టూడియోలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇతడు బాండ్ సినిమాకు పర్ఫెక్ట్ దర్శకుడు అని పలువురు హాలీవుడ్ మేధావులు సైతం తేల్చేశారట.
కారీ జోజి ఫుకునాగా గురించిన విషయాల్లొకి వెళితే... జులై 10, 1977లో కాలిఫోర్నియాలోని అలమేడాలో జన్మించాడు. న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన టీచ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఫిల్మ్ ప్రోగ్రామింగ్ కోర్స్ కంప్లీట్ చేశాడు.
కారీ జోజి ఫుకునాగా కేవలం దర్శకుడు మాత్రమే కాదు రచయిత, నిర్మాత, సినిమాటోగ్రాఫర్ కూడా. 2009లో వచ్చిన 'సిన్ నంబ్రే' అతడికి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. దీంతో పాటు ట్రూ డిటెక్టివ్, మేనియాక్, జేన్ ఐరే చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
జేమ్స్ బాండ్ 25వ మూవీ ముందుగా ప్రకటించిన ప్రకారం నవంబర్, 2018లో విడుదలవ్వాల్సి ఉండగా.... దర్శకుడు మారడంతో షూటింగ్ లేటయింది. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14, 2020కి వాయిదా వేశారు. ఇందులో కూడా జేమ్స్ బాండ్గా డేనియల్ క్రెగ్ కనిపించనున్నాడు.